తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి కిషన్ రెడ్డే : సీఎం రేవంత్

Publish Date:Jun 12, 2026

Advertisement

 

ఢిల్లీ పర్యటనలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత మేర నిధులు ఇచ్చిందో కిషన్ రెడ్డి ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వొద్దని స్వయంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులకు సూచించారని, ఆ విషయాన్ని కొందరు కేంద్ర మంత్రులే తనకు చెప్పారని పేర్కొన్నారు.

ఐఆర్ఎఫ్‌సీకి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మహారాష్ట్రతో పెండింగ్‌లో ఉన్న భూవివాదాలపై కూడా కేంద్ర మంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు.

గతంలో ఏడు మండలాలు, సగం అసెంబ్లీ నియోజకవర్గాన్ని, లక్షల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి కేవలం 1500 ఎకరాల భూమి తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి, కేంద్రంలో బీజేపీ ప్రధాని ఉన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు.

1500 ఎకరాల భూమి విషయంలో కిషన్ రెడ్డి ప్రధాని వద్ద గట్టిగా నిలబడాలని, అవసరమైతే "భూమి ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్ సమావేశాలకు హాజరుకాను" అని చెప్పాలని సూచించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించానని, జూలైలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించాలని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.

తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా పనిచేయడం లేదన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే మెట్రో విస్తరణ జరగబోతున్నా, రాజకీయ కారణాలతో కొందరు నేతలు అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. "రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతో కిషన్ రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ఏం చెబితే ఢిల్లీలో కిషన్ రెడ్డి అదే చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తనతో ఒక్కసారైనా చర్చించలేదని, కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు తనను వెంట తీసుకెళ్లలేదని కిషన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులను కలిసేందుకు తనతో రావాలని సవాల్ విసిరారు.

మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందన

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందించిన సీఎం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించే అధికారం ఆమెకు లేదన్నారు. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదైతే ప్రొసీజర్ ప్రకారం సమన్లు జారీ అవుతాయని తెలిపారు. నామినేషన్ పత్రాల్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరచాలని మాత్రమే నిబంధన ఉందని, నోటీసుల వివరాలు ఇవ్వాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్ అధికారులు, ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఆ పార్టీకి లాభం చేకూర్చారని ఆరోపించారు. సంఖ్యాబలం లేకపోయినా రాజకీయ లాభం కోసం బీజేపీ మూడో నామినేషన్ వేసిందని, అది సాధ్యం కాకపోవడంతో "సీట్ చోరీ"కి పాల్పడిందని విమర్శించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు.

బీజేపీకి ప్రజాస్వామ్యం పట్ల, మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించిన సీఎం, నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన ఇలాంటి కేసులు ఇప్పటివరకు రాలేదని, అన్ని కోణాల్లో న్యాయపరంగా పరిశీలిస్తామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ సభ, హిట్లర్ వివాదంపై స్పందన

పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడం పూర్తిగా లా అండ్ ఆర్డర్ సమస్యల కారణంగానే జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని, తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు.

హిట్లర్ వివాదంపై స్పందిస్తూ, "హైడ్రా అనే పదం హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పాను. హిట్లర్ నాకు ఆదర్శం అని ఎక్కడా చెప్పలేదు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది" అని స్పష్టం చేశారు.

క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ

క్యాబినెట్ విస్తరణపై వస్తున్న వార్తలను మీడియా ఊహాగానాలుగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలోని 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, అయితే రాజ్యాంగ పరిమితుల కారణంగా 17 మందికే అవకాశం ఉంటుందని తెలిపారు.
 

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.