ప్రతిపక్షాలను ఉచ్చులోకి లాగుతున్న కిరణ్

Publish Date:Jan 8, 2014

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన బిల్లుపై అన్ని పార్టీలు చర్చకు రావాలని కోరారు. మొదటి నుండి గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నఆయన ఇంతవరకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు తానేమి చేసారో, చేయబోతున్నారో చెప్పకుండా, “నా ప్రతాపం సభలో చూద్దురుగాని” అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసి, వైకాపా, తెదేపాల వైఖరి ఏమిటో తెలియజేయాలని కాంగ్రెస్ మార్క్ తెలివితేటలు ప్రదర్శించారు. తమది జాతీయ పార్టీ గనుక అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని, కానీ ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలు ఎవరినీ సంప్రదించనవసరం లేదు గనుక ఏ నిర్ణయమయినా తీసుకోగలవని ఒక గొప్ప ‘లా పాయింటు’ కూడా చెప్పారు. అందువల్ల తాము రాష్ట్ర విభజనకు అనుకూలమో వ్యతిరేఖమో సభలో తేల్చి చెప్పాలని ఆయన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలను కోరారు.

 

బిల్లుపై చర్చలోపాల్గొంటే అది విభజనకు అంగీకరించినట్లేనన్నవాదనను ఆయన త్రోసిపుచ్చుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గొంతు చించుకొని అరిచేబదులు, బిల్లుపై చర్చలో పాల్గొని దానిని గట్టిగా వ్యతిరేఖిస్తే ప్రయోజనం ఉంటుందని వైకాపాను ఉద్దేశ్యించి ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తానని రచ్చబండపై నిలబడి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభకు బిల్లు వచ్చిఅప్పుడే నెలరోజులయిపోయినప్పటికీ ఇంతవరకు దానిపై ఒక్క ముక్క మాట్లాడింది లేదు. మరో పదిరోజుల్లో బిల్లు రాష్ట్రపతికి త్రిప్పి పంపబడుతుందని తెలిసి ఉన్నపటికీ కనీసం ఇంతవరకు దానిపై సభలో చర్చమొదలయ్యేలా కూడా చేయలేకపోయారు.

 

తను చేస్తానని చెప్పిన పని చేయకుండా, తాపీగా మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్షాలను నిందిస్తున్నారు. కానీ, బిల్లుపై చర్చజరగకపోవడానికి ప్రతిపక్షాలనే కాదు ఆయననీ, కాంగ్రెస్ పార్టీనీ, కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. ఇంతవరకు ప్రతిపక్షాలు ఏవిధంగా ఈ నిందను తమ ప్రత్యర్దులపైకి నెట్టి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయో, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే చేసారు. ఆయన ఇంతవరకు బిల్లుపై తన వాదనలు వినిపించకపోయినా, ప్రతిపక్షాలు చర్చలో పాల్గొని తమ వైఖరి స్పష్టం చేయాలని కోరడం కేవలం ఆ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును. బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా రాష్ట్రపతికి తిరిగి వెళ్ళిపోతే, అప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ‘సభలో బిల్లును అడ్డుకొంటానని ప్రగల్భాలు పలికి కనీసం చర్చ కూడా మొదలవకుండా ఎందుకు త్రిప్పి పంపారని’ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తనని నిలదీయస్తారనే ఆలోచనతోనే ముందు జాగ్రతగా కిరణ్ కుమార్ రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారు.

 

నిజానికి ఆయన మొదటి నుండి కూడా రాష్ట్ర విభజన వ్యవహారంలో అధిష్టానానికి పరోక్షంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తన పార్టీ సభ్యులతో కలిసి బిల్లుపై చర్చ జరగనీయకుండా అదే విధంగా సహకరిస్తున్నారు. అందుకే సభలో వాదనలు చేసే బదులు, జనవరి23వ తేదీ తరువాత తదుపరి కార్యాచరణ గురించి కూడా మాట్లాడుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.