Publish Date:Apr 19, 2020
రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. కాబట్టి మరింత కఠినంగా లాక్డౌన్ అమలుచేస్తున్నాం. ఇప్పట్టికే 50 వేల వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి దయచేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దు. వ్యాధి తగ్గలేదు. వైరస్ నియంత్రణలో లేదు. మరింత ఉధృతంగా వుంది కాబట్టి జాగ్రత్తగా వుండమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఏమైనా అవసరమైతే డయల్ 100కు ఫోన్ చేయండి. మీకష్టాల్ని తొలగించడానికి అధికారులు సిద్ధంగా వున్నారు. ప్రజలు ప్రభుత్వం కలిసి కరోనాను ఎదుర్కొంటే ఈ ప్రమాదం నుంచి బయట పడతాం. ఇప్పట్టి వరకూ ఈ వ్యాధికి మందు లేదు. ఆ విషయం గుర్తు పెట్టుకోమని ప్రజలకు ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ రోగానికి మందు లేదు. వేరే మార్గం లేదు. ఉపశమనచర్యలే. వ్యక్తి గత నియంత్రణ పాటించడం. లాక్ డౌన్ ఇంతకు మించిన ఆయుధం ప్రస్తుతం మరొకటి లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి కొన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్న విషయాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
14 అంతస్థుల స్పోర్స్ట్ కాంప్లెక్స్ను హెల్త్ డిపార్టెమెంట్కు బదిలీ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నిమ్స్ కంటే ఎక్కువ సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ టిమ్స్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం దీన్ని కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా ఉపయోగిస్తాం. 1500 బెడ్లను సిద్ధం చేశాం. రేపటి నుంచి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి ఉపయోగంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 1500 మందికి టెస్ట్లు చేసే సదుపాయం వుంది.
జూన్ 7వ వరకు ఫంక్షన్లకు అనుమతి ఇవ్వం. కాబట్టి ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక గౌడన్లుగా వాడుకొని రైతులకు ఆదుకోమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మే 7వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు తన వ్యక్తి గత నిర్ణయం కాదు. ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-kcr-about-coronavirus-25-97956.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు