ఆ చంద్రబాబే కావాలి.. ఈ చంద్రబాబు వద్దు

Publish Date:Sep 15, 2015

Advertisement

 

హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మాణంకోసం, సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం కోసం కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన ఆంధ్రుల పాలిట నవశకానికి నాంది పలికే నాయకుడిగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ ను అట్టడుగు స్థానం నుండి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లగలిగే స్థైర్యం ఉన్న నేతగా నమ్మి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించి పట్టం కట్టారు.

కాని నేడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు కావాలి కాని, నేటి చంద్రబాబు కాదు అని సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క శివాజీ ఆరోపణ మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకోసం నిరంతరం కృషి చేస్తున్న చాలా మంది సీనియర్ల నుండి కార్యకర్తల వరకు అదే భావన. చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఉన్నదని.. ఆయన ఆ కోటరీ ఉచ్చులో బిగుసుకొని వాస్తవాలను గుర్తించడంలేదని చాలా మంది నేతల వేదన.

ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఒకసారి గమనిస్తే క్షేత్రస్థాయి అవసరాలపై, సమస్యలపై అవగాహన లేని పరకాల ప్రభాకర్ లాంటి ప్రభుత్వ సలహాదారు, తిమ్మిని బమ్మిని చేసి చూపే ఐఏస్ ఆఫీసర్లు, బ్యూరో క్రాట్స్.  ప్రభుత్వ పథకాల పనితీరు, అమలు ఎలా ఉన్నా వీరికి అనవసరం. చంద్రబాబు నాయుడిని ఎంతగా తమ కల్లబొల్లి మాటల ద్వారా సంతృప్తి కరంగా ఉంచగలిగామన్నదే వారి ఆలోచన. దీనికి తోడు విమర్శలు గిట్టని చంద్రబాబు నైజం. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని బాబు వరకూ చేరకుండా అంతా బాగానే ఉందనే ఈ కోటరీ కితాబు. దీనితో ఆంధ్ర రాష్ట్రంలో బాబుగారి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి గాడితప్పిన పాలన. బాబుగారి వ్యవహారం చూస్తేనే తన చుట్టూ ఉన్నా భజన పరుల కోటరీలో సదా కాలక్షేపం.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైనా సరే ఈ కోటరీని దాటి బాబుగారిని చేరే పరిస్థితి లేని కారణాన ఏం చేయాలో అర్ధంకాని దైన్యం పార్టీలో నెలకొంది. దీనికి తోడు లోకేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ ఐఏస్ ఆఫీసర్ అయినా లోకేశ్ కన్నుసన్నల్లోనే పనిచేయాల్సి రావడంతో ఈ భజన బృందం లోకేశ్ ను కూడా అదే తరహాలో పొగడ్తలతో ముంచెత్తుతూ, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ పాలనను అపహాస్యం చేస్తున్నారు.

వీరికి తోడు వివిధ ప్రాజెక్టులను దక్కించుకునే యావలో కాంట్రక్టర్లు పార్టీలోని ఆర్ధిక బలంతో మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్న రాజకీయ అవగాహన, పరిపాలన అవగాహన లేని మరికొంతమంది నేతలతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది.

దీనికి ఉదాహరణగా రాజమండ్రిలో పుష్కరాల సంఘటన, ప్రత్యేక హోదాపై రోజుకోరకమైన ప్రభుత్వ వ్యాఖ్యానాలు, రైతు రుణమాఫీ అమలవుతున్నతీరు, నిరుద్యోగ భృతి అందని నిరుద్యోగులు, గుంటూరు నాగార్జున వ్యవహారం, రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ నడుస్తున్న విధానం వెరసి నిజంగా ఇది చంద్రబాబు నాయుడి పాలనేనా అనే ప్రజలకు తీవ్రమైన సందేహం కలుగుతోంది.

తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం వివిధ కన్సెల్టీలు, కాంట్రక్టర్లు, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ సలహాదారుల కోటరీ నుండి చంద్రబాబు బయటపడి తన పాలనలో ప్రజలు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టినిసారించక పోతే నష్టపోయేది పార్టీనే. నీతికి మారుపేరైనా పరిపాలన అందిచకుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని విశ్లేషకులు సైతం విస్మయం చెందేలా అవినీతిలో కూరుకుపోయిన పాలనను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు స్వయంగా పూనుకోకపోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం.

By
en-us Political News

  
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.