Publish Date:Aug 30, 2022
ప్రభుత్వాధినేత ఎవరైనా సరే ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు పాటుపడాలి. గత పాలకులకంటే తన పాలన మెరుగ్గా ఉందని నిరూపించుకోవడానికి పని చేయాలి. అలా కాకుండా స్వయంగా ఆయన వల్లనే జనం తీవ్రమైన ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీయులు సరిగ్గా ఇదే అనుకుంటున్నారు.
ఆయన ప్రగతి భవన్ నుంచి తన ఫాం హౌస్ కు తరచూ చేసే ప్రయాణాలు హైదరాబాదీయులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఆయన చాలా తరచుగా చేస్తున్నపర్యటనల పట్ల జనం చీకాకుపడుతున్నారు. ఆయన తిరగడానికి మేం ట్రాఫిక్ లో చిక్కుకుని యాతన పడాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన ఈ ప్రయాణం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే సాగుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకూ, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనూ.. అలాగే సాయంత్రం తిరిగి వారు ఇళ్లకు చేరే సమయంలోనూ కేసీఆర్ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఆపేస్తుంటారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ మీదుగా సాగే ఆయన పయనం.. ఆ దారిలో వెళ్లే వారికి నరకం చూపిస్తోంది.
ఈ పరిస్థితి వారంలో కనీసంలో కనీసం రెండు సార్లు ఉంటుంది. అంటే వారంలో రెండు సార్లు ఉదయం, సాయంత్రం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తా ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కులు పడాల్సిందే. అంబులెన్సులు సైతం నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ను ఆపడానికి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరు వైపులా కనిపించే పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లిపోగానే మాత్రం కనిపించరు. దీంతో కాన్వాయ్ వెళ్ళిన తరువాత అప్పటి వరకూ నిలిచిపోయిన వాహనాలు ఒకే సారి అన్ని వైపుల నుంచీ కదలడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో గంట, వెరసీ కనీసం రెండు గంటల పాటు సీఎం కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ చిక్కులు ఎదురౌతున్నాయి.
గతంలో ఏ సీఎం వల్లా ఇలా ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురైన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒక సారి ఏదో అత్యవసర పని మీద భారీ కాన్వాయ్ తో సీఎం కదిలారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా తరచూ క్యాంపుకార్యాలయానికీ, ఫాంహౌస్ కు తిరగడానికి గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జనం విసుక్కుంటున్న పరిస్థితి ఆయన కాన్వాయ్ వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తోంది. దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించే విషయంలో మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధానాన్ని అవలంబిస్తున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-canvoy-troubles-hyderabad-people-39-142935.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.