జగన్, జవహర్‌రెడ్డి మధ్య ఏబీవీ చిచ్చు?

Publish Date:May 30, 2024

Advertisement

త్వరలో మాజీ కాబోయే ముఖ్యమంత్రి జగన్, త్వరలో మాజీ కాబోతున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మధ్య స్నేహం ఇప్పటి వరకూ మూడు అధికార దుర్వినియోగాలు, ఆరు ఆశ్రిత పక్షపాతాలుగా సాగింది. ఇంతకాలం జగన్ ఆడమన్నట్టల్లా ఆడిన జవహర్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తన పాత విశ్వాసాన్ని మరచిపోకుండా జగన్ సేవలో తరిస్తూ వచ్చారు. ప్రతిపక్షాల మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకుని, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి తీరాల్సిందే అన్నట్టుగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్‌కి, జవహర్‌రెడ్డికి ఎంత ఫెవీకాల్ లాంటి స్నేహమైనా, జూన్ నాలుగో తారీఖు వరకే. ఇప్పటి వరకూ సాఫీగా సాగిన, ఇద్దరి పదవులు ఊడిపోయిన తర్వాత ఒకరి అవసరం మరొకరికి వుంటే కొనసాగే ఇద్దరి స్నేహంలో ఒక చిచ్చు వచ్చి పడింది. ఆ చిచ్చు పేరే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఆదేశించింది. తాజాగా హైకోర్టు కూడా ఆదేశించింది. రేపు ఒక్క రోజుతో ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ కెరీర్ ముగుస్తుంది. ఆయనకు పోస్టింగ్ రావడం అంటూ జరిగితే రేపు ఒక్క రోజులోనే జరగాలి. లేకపోతే ఆయన యూనీఫామ్‌లో రిటైర్ అవ్వరు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్.ని తీసుకుని ఏబీ వెంకటేశ్వరరావు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని గురవారం నాడు కలిశారు. ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి మీద వుంది. జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇస్తే, ఏబీ వెంకటేశ్వరరావు రేపు ఒక్కరోజు డ్యూటీ చేసి, యూనీఫామ్‌లో రిటైర్ అవుతారు. 

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి జగన్‌తో ఏవో లావాదేవీలు వున్నాయి. అందుకే రాజకీయంగా ఆయనకు సహకరిస్తున్నారు. కానీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో ఎలాంటి విభేదాలూ లేదు. ఆయన కూడా డీజీపీ అయ్యే స్థాయి వున్న ఐపీఎస్ అధికారే. జగన్ అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశాడు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవ్వలేదుగానీ.. లేకపోతే ఏనాడో ఆయన ఆ పోస్టులో కూర్చునేవారే. అంత సీనియర్ అధికారి యూనీఫామ్‌లో రిటైర్ అయ్యేలా చేయడం కనీస ధర్మం అని జవహర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఒక్కరోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని జవహర్ రెడ్డి భావిస్తుంటే, లండన్ నుంచి జగన్ ఇవ్వడానికి వీల్లేదని ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. 

అయితే జవహర్ రెడ్డి మాత్రం ఏబీవీకి పోస్టు ఇచ్చే విషయంలో జగన్‌ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగన్ మాత్రం ఠాఠ్ వీల్లేదని అంటున్నట్టు తెలుస్తోంది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకపోతే అది ఆ తర్వాత జవహర్ రెడ్డి పీకకి చుట్టుకునే ప్రమాదం వుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది జవహర్ రెడ్డే. నిజానికి ఆయన ఈ విషయంలో జగన్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. అయిప్పటికీ జగన్ హర్ట్ అవకుండా తన బాధ్యతని నెరవేర్చడానికి జవహర్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం వీల్లేదంటే వీల్లేదని అంటున్నట్టు సమాచారం. జగన్ లండన్ నుంచి శుక్రవారం నాడు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇష్యూని ఇంకా లాగే ఉద్దేశంతో జగన్, ‘‘నేను వచ్చాక మాట్లాడదాం’’ అని జవహర్‌రెడ్డితో అన్నట్టు సమాచారం. మరి ఆయన వచ్చి, ప్రయాణ బడలిక తీర్చుకుని, కాలయాపన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ఏది ఏమైనప్పటికీ, జగన్ ఒప్పుకోకపోయినప్పటికీ రేపు ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంలోనే జవహర్ రెడ్డి వున్నట్టు సమాచారం. దీని కోసం జగన్‌తో బంధం కటీఫ్ అయిపోయినా పర్లేదనే నిర్ణయానికి జవహర్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి, ఏదైనా బలమైన అవాంతరం వస్తే తప్ప, ఏబీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు పోస్టింగ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.