కలరా కలవరపెడుతోందా!

Publish Date:Jul 8, 2016

Advertisement

 

ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా... రోగం అనే పదం మనిషిని ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఏదో ఒకవైపు నుంచి విరుచుకుపడుతూనే ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు చాలా మందులు ఉండవచ్చు కాక! కానీ నివారణను మించిన మార్గం లేనే లేదు. ఇప్పుడ కలరాదీ అదే పరిస్థితి! ఒకప్పుడు కలరా వ్యాపిస్తే లక్షలాదిమంది పిట్టల్లా రాలిపోయేవారు. మానవచరిత్రలో కలరా బారిన పడి చనిపోయినవారి సంఖ్య కోట్ల మీదే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తూ ఇప్పుడు కలరాని ఎదుర్కొనేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అయినా కలరా గురించి తెలుసుకోవడమే, దాన్ని ఎదుర్కొనేందుకు తొలిమార్గం!

 

ఇదీ కారణం

 

మనుషులు తీసుకునే ఆహారంలో, మరీ ముఖ్యంగా మంచినీరులో ‘విబ్రియో కలరే’ అనే సూక్ష్మక్రిమి చేరడం వల్ల కలరా వ్యాపిస్తుంది. ఇది మన పేగులలో చేరి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కలరా సోకిన మనిషిలో వాంతులు, విరేచనాలు, దాహం, గొంతు పొడిబారిపోవడం, కండరాల నొప్పులు, కడుపునొప్పి... ఇలా చాలా రకాలైన లక్షణాలు కనిపించవచ్చు. శరీర తత్వాన్ని బట్టి ఈ లక్షణాలు ఒక గంట నుంచి ఐదు రోజుల వరకూ ఎప్పుడైనా బయటపడవచ్చు. అలాగని కలరా సోకిన వారందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయనుకోవడానికి లేదు. ఎలాంటి లక్షణాలు లేనివారు తమకు తెలియకుండానే ఇతరులకు కలరాని అంటించే ప్రమాదం లేకపోలేదు.

 

వ్యాపించే తీరు!

 

కలరా సోకిన మనిషి మలమూత్రాల ద్వారా ఈ వ్యాధి చాలా త్వరితగతిన ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. నీటిలో కలిసి ఈ విసర్జితాలన ద్వారా కలరా వ్యాపిస్తుంది. మన ఇంట్లో తాగే నీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ హోటళ్లు, చిరుతిండి బళ్లు, బస్టాండుల వంటి ప్రదేశాలలో నీటి గురించి అంత శ్రద్ధ వహించే అవకాశం ఉండకపోవచ్చు. నీరు చల్లగా ఉండేందుకు వాడే ఐస్‌ ఏ నీటితో తయారుచేస్తున్నారో తెలియదు. మనం వాడే కూరగాయలు ఏ నీటిలో పండిస్తున్నారో తెలుసుకోలేం! ఆఖరికి పానీపూరీ వంటి పదార్థాలలో ఏ నీరు కలుస్తోందో చెప్పలేం! అందుకని కలరా గురించిన వార్తలు వినిపిస్తుంటే... తినే ఆహారం విషయంలోనూ, తాగే నీటి విషయంలోనూ వీలైనంత జాగ్రత్త వహించడం అవసరం.

 

ఎలాంటి జాగ్రత్తలు?

 

- పైపుల్లో వస్తున్న నీరు రంగుమారినట్లు కానీ, వాసనతో కానీ వస్తుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.

 

- కలరా వ్యాపించిందని తెలియగానే త్రాగునీటిని కాచి చల్లార్చి వడబోసి మాత్రమే తాగాలి. ముఖ్యంగా పిల్లలుండే ఇళ్లలో ఈ జాగ్రత్తను తప్పకుండా పాటించాలి.

 

- బయటకు వెళ్లేటప్పుడు ఒక బాటల్‌ నీటిని వెంట తీసకువెళ్లక తప్పదు. దీనివల్ల ఎక్కడ దాహం వేస్తే అక్కడి నీటిని తాగాల్సిన అగత్యం ఉండదు.

 

- బయట నుంచి వచ్చిన తరువాత కూడా కాళ్లూచేతులను శుభ్రంగా కడుక్కోవడం మరువకూడదు.

 

- వాంతులు, విరేచనాలు వంటి కలరాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించడం మంచిది. కలరాను కనుక నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

 

- పళ్లు, కూరగాయలను వాడకానికి ముందు శుభ్రంగా కడగాలి. కలరా భయం తీరేంతవరకూ పళ్లు, కాయగూరలను చెక్కుతీసుకునే వాడుకోవాలి.

 

ఈ చర్యలతో కలరా ఆమడ దూరంలో ఉండిపోతుందని వేరే చెప్పనవసరం లేదు కదా!

 

- నిర్జర.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.