Publish Date:Jul 10, 2025
ఇదీ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు పత్రికల్లో పెడుతోన్న క్యాప్షన్స్. జులై 9న జగన్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల పరమార్శకు వచ్చారా? లేక తన హంగూ ఆర్భాటం చూపించడానికి వచ్చారా? ఎవరికీ అర్ధం కాలేదు. అదసలు పరమార్శ యాత్రలా లేదు. దండయాత్రను తలపిస్తోందన్న మాట వినిపిస్తోంది. అధ్యక్షుడినే ఏకంగా చొక్కా పట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవరూ ఎవరి మాట వినడం లేదు. జగన్ అరుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదెవరూ. 10 లక్షల జనాభా వచ్చినా టీడీపీ సభలు సజావుగా జరిగినవి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేకలేంటి? రచ్చ రావణ్యమేంటి? కొందరననే మాటలేంటంటే అరలుంగీలు కట్టి వదిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది సర్వత్ర
.అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒకటే బ్యాచ్, ఒకటే లుక్. ఎలాంటి తేడా లేదు. అలజడి సృష్టించడానికి అందరూ కలసి కట్టు కట్టుకుని మూకుమ్మడిగా దిగినట్టుగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడం కాదు.. మన్నాంగడ్డి కాదు. ఇది అదే. శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలిగించేదే.. కాబట్టి దీన్ని కంపల్సరిగా కట్టడి చేయాలంటారు కొందరు. మరి కొందరైతే ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమ్యలను తెలుసుకుని.. ప్రజా వేదికలైన అసెంబ్లీకి వెళ్లి సమస్య పరిష్కారం కనుగొనడం ఒక రూట్ మ్యాప్. ఆయనసలు అసెంబ్లీకే వెళ్లకుండా ఏం సాధించేటట్టు? అదీ నిజమే కదా అంటారు ఇంకొందరు. జగన్ ఇప్పట్లో అప్పట్లో అసెంబ్లీకి వచ్చేది లేదు. అక్కడ రైతులు కాదు.. ఇతరులెవరి సమస్యలను చర్చించే అవకాశమే లేదు. ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.
అయినా సీజన్ అయిపోయాక వచ్చి ప్రయోజనమేంటి? అంటారు కొందరు రైతులు. ఒక వేళ జగన్ నిజంగా చేయాల్సి వస్తే ఇప్పటికే జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వ ఉన్న లక్ష కిలోల పల్ప్ ని కొనాలి. ఎందుకంటే తమ దగ్గర అంత నిల్వ ఉంది కాబట్టి.. ఈ సీజన్ కి పల్ప్ వద్దన్నది ఫ్యాక్టరీల మాట. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడవుతుందో ఆపై తాము కొంటామని అంటారు వారు. ఈ సీజన్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్పట్లో ముప్పై రూపాయలు పర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయలకు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొనడం లేదు. ఇక్కడ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు కొంటున్నాయి కదాని.. టేబుల్ రకాలు పక్కన పెట్టి, తోతాపురి రకం ఎక్కువగా వేసేశారు రైతులు.
ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన తంటా ఇది. దానికి తోడు తన హయాంలో ఈ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. జగన్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ సారి వర్షాలు కూడా బాగా పడ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వచ్చిన సమస్య ఇది. ఇది జనానికి అర్ధం కావల్సిన విషయం. కానీ జగన్ ఏం చేస్తున్నారు? బల ప్రదర్శన చేయడానికో వేదిక చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్య ఏంటో అర్ధంకాక ఒక గజిబిజి గందరగోళానికి ఆస్కారమేర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chittoor-district-25-201691.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.