Publish Date:Mar 21, 2015
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిద్దరూ కూడా సినీరంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొన్నప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ వారిరువురు రాజకీయాలలో రాణించలేకపొతున్నారనే సంగతి అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది. అందుకే చిరంజీవి మళ్ళీ సినీపరిశ్రమకు వెళ్ళిపోయి తన 150వ సినిమాపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు జనాల ముందుకు వచ్చి ఏదో ఆవేశంతో మాట్లాడివెళ్ళిపోతున్నారు తప్ప సినీపరిశ్రమ వదిలిపెట్టే ఉద్దేశ్యం కనబడటం లేదు. కానీ వారిరువురు ప్రత్యర్ధ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలను భుజాలకెత్తుకోవడంతో వారి అభిమానులలో చాలా గందరగోళం ఏర్పడి రెండు గ్రూపులుగా చీలిపోవలసి వచ్చింది. కానీ అన్నదమ్ములిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు, వారి అభిమానులు అందరూ కూడా ఒక్కటిగా కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బహుశః అందుకే చిరంజీవి అభిమాన సంఘాలు ఈరోజు హైదరాబాద్ లో సమావేశమవుతున్నాయి. ఒకప్పటి రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలో ఇంకా కొనసాగడమా లేక తనకు అచ్చిరాని రాజకీయాలు వదిలిపెట్టడమా లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో జనసేన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దడమా? అనే సందిగ్ధంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిమానుల కోరిక మేరకు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక ఈరోజు హైదరాబాద్ లో జరుగబోయే చిరంజీవి అభిమానుల సంఘాల సమావేశం చాలా కీలకమయినదేనని భావించవచ్చును.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-39-44335.html
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.