రక్షణ కవచాలే రాబందులు.. చైనా ఆర్థిక పతనం ప్రభావం!

Publish Date:Apr 18, 2026

Advertisement

ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి కేవలం దేశ జీడీపీ వృద్ధి రేటు పడిపోవడానికో లేదా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడానికో పరిమితం కాలేదు. ఇది ఒక  వ్యవస్థాత్మక వైఫల్యం. అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు,  ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం   సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.

ముఖ్యంగా ఆరోగ్య రంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో వైద్య సేవలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ..  దేశవ్యాప్తంగా ప్రభుత్వ,  ప్రైవేట్ ఆసుపత్రులు భారీగా మూతపడుతున్నాయి.  మూడేళ్లుగా సాగిన లాక్ డౌన్ లు, కఠిన పరీక్షల వల్ల మెడికల్ ఇన్సూరెన్స్ నిధులు అడుగంటిపోయాయి. దీంతో ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు నిలిచిపోయి, డాక్టర్ల జీతాల్లో కోతలు విధిస్తూ సేవలను నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లడం, జనాభా తగ్గుదల వంటి కారణాలతో చిన్న స్థాయి వైద్యశాలలు దివాళా తీస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రజల నమ్మకం సడలిపోతోంది. తన సొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలన్నా ప్రజలు అనేక విచారణలను ఎదుర్కోవాల్సి వస్తోంది.  యాంటీ-ఫ్రాడ్ తనిఖీల పేరుతో డిపాజిటర్లను ఇబ్బంది పెడుతూ.. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. వందల కొద్దీ బ్యాంకు శాఖలు మూతపడ్డాయి.  దీంతో  ప్రజల పొదుపు మొత్తాలు రిస్కీ పెట్టుబడులకు మళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. రక్షణగా ఉండాల్సిన ఆర్థిక సంస్థలే ఇప్పుడు డిపాజిటర్లకు శత్రువులుగా మారిన పరిస్థితి.  

మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాలు సైతం ప్రభుత్వానికి రాబడి మార్గాలుగా మారిపోయాయి. షావోలిన్ వంటి చారిత్రాత్మక ఆలయాలపై సాయుధ బలగాల నిఘా పెరిగింది. ఇప్పటికే వందలాది ఆలయాలను మూసివేసిన ప్రభుత్వం, వాటి ద్వారా వచ్చే విరాళాలను, పర్యాటక ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తోంది. ఆధ్యాత్మిక శాంతి దొరకాల్సిన ప్రదేశాలను సైతం చైనా ప్రభుత్వం కేవలం ఆదాయం పిండుకునే  ఏటీఎం లుగా వాడుకుంటోంది.

ఉపాధి రంగంలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.  చిన్న నగరాల్లో జీతాలు దాదాపు మూడు దశాబ్దాల కిందటి స్థాయికి పడిపోయాయి.  మరోవైపు..  పేకింగ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పీహెచ్‌డీ పట్టాలు పొందిన యువత కూడా తక్కువ జీతం ఉన్నా సరే ప్రభుత్వ భద్రత ఉంటుందనే ఆశతో చిన్న స్థాయి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ప్రైవేట్ టెక్ రంగం,  రియల్ ఎస్టేట్ రంగాలు బలహీనపడటంతో యువతలో భవిష్యత్తుపై అభద్రతా భావం పెరిగిపోయింది. గంటల కొద్దీ శ్రమించినా కనీస అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో సైతం నెలల తరబడి జీతాలు అందడం లేదంటే పరిస్థితి తీవ్రత అవగతమౌతుంది. బీజింగ్‌లోని కీలక సెక్యూరిటీ సంస్థల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల జీతాలు బకాయిలుగా ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా వేతనాలు అందని పరిస్థితి ఉందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక ఒత్తిడి ఎంతలా ఉందంటే..  రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేందుకు కూడా మధ్యవర్తులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చి మరీ  వాటిని  ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఒక యూనిఫాం, సిస్టమ్ లోపల ఉన్నామనే భ్రమ కోసం పేదరికాన్ని సైతం వారు ఆహ్వానిస్తున్నారు. 

గిగ్ ఎకానమీ,  నిరాశ్రయుల సంఖ్యలో కనిపిస్తున్న పెరుగుదల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో చెబుతోంది.  ఫుడ్ డెలివరీ చేసే కార్మికుల ఆదాయం విపరీతంగా తగ్గిపోగా, దేశంలో నిరాశ్రయుల సంఖ్య   4.7 కోట్లకు చేరుకుంది.  ఇందులో 60 శాతానికి పైగా 33 ఏళ్ల లోపు యువతే కావడం విశేషం.  పెద్ద నగరాల్లో భోజనం కోసం క్యూలో నిలుచుంటున్న నిరాశ్రయులైన యువతను చూస్తుంటే చైనాలో సామాజిక భద్రతా వలయం పూర్తిగా విచ్ఛిన్నమైందని స్పష్టమవుతోంది. దేశం బయట కూడా చైనా పౌరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇజ్రాయెల్ వంటి యుద్ధ ప్రాంతాల్లో పని చేస్తున్న చైనీయులు, తమ దేశానికి తిరిగి వస్తే ఉపాధి దొరకదనే భయంతో అక్కడే ఉండటానికే  మొగ్గు చూపుతున్నారు. విదేశాలకు వెళ్లే మార్గాలు కూడా ఖరీదైనవిగా మారడం తో ప్రజలు దేశంలోనే ఇరుక్కుపోయారు. మొత్తానికి, ప్రజల రిస్కును తగ్గించాల్సిన వ్యవస్థలే ఇప్పుడు ఆ భారాన్ని జనంపైకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి.    భవిష్యత్తు ఉందనే  ఆశ కంటే  అవకాశాలు ముగిసిపోతున్నాయనే భయమే ఇప్పుడు చైనా అంతటా తాండవిస్తోంది.

-సీతారాం కంఠమనేని
 

By
en-us Political News

  
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది.
అధికారిక గణాంకాల్లో జీడీపీ, రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా అన్ని రంగాలలో వృద్ధి చూపిస్తాయి. కానీ నేలమీద ప్రజలు చూస్తున్నది మాత్రం వేతనాలు అందకపోవడం, బ్యాంకుల్లో దాచుకున్నడబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు. మూతపడుతున్నఆస్పత్రులు, కట్టుదిట్టమైన ఆలయ నియంత్రణలు, రక్షణ నుంచి ఎక్స్ట్రాక్షన్ వైపు మార్పు.
రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ప్రముఖ భారతీయ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు.
పున‌ర్వికకు పున‌ర్జ‌న్మ‌ను ప్ర‌సాదించే చికిత్స‌కు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్ష‌న్ రప్పించేందుకు స‌హ‌క‌రించారు. ఇంజెక్ష‌న్ వేసేట‌ప్పుడు చిన్నారి పున‌ర్విక చెంత‌నే ఉన్నారు. సాయం అందించిన‌ ల‌క్ష‌లాది మంది ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. పున‌ర్జ‌న్మ పొందిన పున‌ర్విక లోకేష్ చేతుల్లోంచి బోసిన‌వ్వులు చిందించింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విచారణ పారదర్శ కంగా జరగాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థలు డెల్లాయిట్, త్రిలిగల్ సహకారంతో విచారణ చేపట్టింది. ఈ కమిటీ పనితీరును టీసీసీ ప్రెసిడెంట్, సీఈవో క్రితివాసన్ పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు 2024లో సంగీతకు నవీన్ తో ఘనం గా వివాహం జరిపించారు. ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్డీయే సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇద్దరు దుండగులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాప్ లపై రెక్కీ నిర్వహించారు. అనంతరం గురువారం అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ.. హఫీజ్ పేట్ మార్తండ నగర్ లో హోల్సేల్ సిగరెట్ల షాప్ వద్ద ఆగి, ఇనుప రాడ్లతో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి కొంత నగదు, విలువైన సిగరెట్ కార్టన్లు తీసుకొని దర్జాగా మళ్ళీ కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.