వేళ్లు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యం!

Publish Date:Jul 12, 2016

Advertisement

పిల్లలు తల్లి గర్భంలో ఉండగానే వారిలో వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుందట. కానీ వారు బయట ప్రపంచంలోకి వచ్చి, పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ అలవాటుని మానుకోకపోతే పెద్దలు బెంబేలెత్తిపోతుంటారు. నయానోభయానో తమ పిల్లలలో ఈ అలవాటుని మాన్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వారిని కొట్టడమో, వేళ్లకి బ్యాండేజీలు చుట్టడమో చేస్తుంటారు కూడా! కానీ ఆశ్చర్యకరంగా... పిల్లల్లో వేళ్లు చీకే అలవాటు మున్ముందు కొన్ని అనారోగ్య సమస్యలని దూరంగా ఉంచుతుందని ఒక పరిశోధన చెబుతోంది.

40 ఏళ్ల పరిశోధన!

పిల్లల్లో వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానివల్ల వారి పళ్లు దెబ్బతింటాయనీ, నత్తి వచ్చే ప్రమాదం ఉందనీ... అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ కంగారుపడటం సహజం. కానీ న్యూజిలాండ్‌లో దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న ఓ పరిశోధన ఇందుకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా నిపుణులు 1972-1973 సంవత్సరాల మధ్య పుట్టిన ఒక 1037 మంది పిల్లలను గమనిస్తూ వస్తున్నారు. ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లల్లో ఎలాంటి అలవాట్లు ఏర్పడుతున్నయో నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిలో 5,7,9,11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరెవరిలో గోళ్లు కొరుక్కోవడం, వేళ్లు చప్పరించడం అనే అలవాట్లు ఉందో పరిశీలించారు.

తరువాతకాలంలో...

తాము పరిశోధన కోసం ఎంచుకున్న పిల్లలకి 13, 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వారి మీద కొన్ని పరీక్షలు జరిపారు పరిశోధకులు. ఇందులో భాగంగా దుమ్ముకణాలు, పెంపుడు జంతువులు, ఇంట్లో కనిపించే సూక్ష్మక్రిములు... వంటివాటి నుంచి సదరు పిల్లలకు అలెర్జీలు సోకే అవకాశం ఏమేరకు ఉందో పరీక్షించారు. ఆశ్చర్యకరంగా వేళ్లనీ చీకే అలవాటు ఉన్న పిల్లల్లో అలెర్జీలను ఎదుర్కొనే శక్తి 31 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. పైగా పిల్లల్లో వేళ్లని చప్పరించడంతో పాటుగా, గోళ్లు కొరుక్కునే అలవాటు కూడా ఉంటే వారిలో ఈ నిరోధక శక్తి మరింత అధికంగా కనిపించింది.

కారణం !

మన వేళ్ల మీదా, గోళ్ల లోపలా రకరకాల సూక్ష్మక్రిములు నివాసం ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే చిన్నతనంలోనే వీటికి పిల్లలు అలవాటు పడటంతో, వారిలో సదరు క్రముల పట్ల నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు పరిశోధకులు. అయితే ఏఏ క్రిముల పట్ల ఇలాంటి నిరోధక శక్తి లభిస్తుందో ధృవపరిచే ప్రయత్నంలో ఉన్నారు. అలాగని పిల్లల్లో ఈ అలవాట్లు కనిపిస్తే చూసీ చూడకుండా ఊరుకోవడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక వయసు దాటిన పెద్ద పిల్లలు కనుక గోళ్లు కొరుక్కోవడమో, వేళ్లు చప్పరించుకోవడమో చేస్తుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించమని చెబుతున్నారు. పెద్ద వయసులో ఇలాంటి అలవాట్లు ఉండటం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనీ, కొన్ని మానసిక సమస్యలకు కూడా ప్రతిబింబంగా మారుతుందనీ తేల్చి చెబుతున్నారు. కాబట్టి పసి పిల్లల్లో కనుక వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానిని మాన్పించే ప్రయత్నం అయితే చేయవచ్చు కానీ.... మరీ బెంబేలెత్తిపోవల్సిన అవసరం మాత్రం లేదన్నమాట!

- నిర్జర.

 

 

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.