చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ కొనసాగుతున్నకొద్ది.. ఆయన మరింత కూరుకు పోతున్నా రనిపిస్తోంది. ఈ స్కామ్లోని సొమ్ము తరలింపులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు చెవిరెడ్డి అనుచరులే. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్కృష్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
చెవిరెడ్డి అరెస్ట్కంటే ముందే వీరిద్దరూ అజ్ఞాతంలోకి జారుకున్నారు. వీరికి కొందరు బడా నేతలు డబ్బులు సమకూర్చి ఇతర రాష్ట్రాలకు పంపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలోనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పట్టుబడ్డారు. ఇప్పుడు వీరిద్దరితో కలుపుకుంటే ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 11కు చేరుకుంది. ఇప్పుడీ కేసులో వీరిద్దరు నోరు తెరిస్తే చెవిరెడ్డి మరింత ఇరుక్కుంటారనే చర్చ నడుస్తోంది.
రాజ్ కెసిరెడ్డి బృందం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో వీరిద్దరిదీ కీలక పాత్ర అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు దొరకడం వల్లే సిట్ అధికారులు వారిని అరెస్టు చేశారు.
ఇలా రోజురోజుకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడంతో చెవిరెడ్డిలో ఫ్రస్టేషన్ పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో.. తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పునకు శిక్ష అనుభ విస్తున్నా అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. చెవిరెడ్డి అంతలా ఊగిపోతున్నా పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి తరలించారు. తన కీలక అనుచరులు వరుసగా దొరికి పోతుండటంతో చెవిరెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో త్వరలో ఈ కేసులో ఎవరెవరున్నారో.. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? చెవిరెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chevireddy-bhaskarreddy-in-frustration-39-201074.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.