Publish Date:Apr 23, 2026
ఐపీఎల్ 2026లోచెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 103 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.
అనంతరం 208 పరుగుల భారీ విజయ లక్ష్యంతో లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 11 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్పిన్నర్ అకీల్ హోసేన్ ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులు, తిలక్ వర్మ 37 పరుగులతో కొద్ది సేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. వారు కూడా ఔటైన తరువాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పేకమేడను తలపించేలా కుప్పకూలింది. దీంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటై 103 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక చెన్నై విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్ సంజుశాంసన్ ఈ సీజన్ లోనే రెండో సెంచరీ సాధించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chennai-super-kings-superb-victory-against-mumbay-indians-36-218109.html
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.