మారుతున్న తుని రాజకీయం..! గెలుపు దిశ‌గా య‌న‌మ‌ల దివ్య‌

Publish Date:May 3, 2024

Advertisement

తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది.  గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే,  ఇక్క‌డ‌  సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో  లెక్కలు మారిపోయాయి.  నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ  అయితే కొన‌సాగుతోంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ది రాజాకు 92,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ది కృష్ణుడుకు 68,443 ఓట్లు పోలయ్యాయి.  

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్దదిక్కుగా ఉన్నారు. తుని అంటే యనమలకు కంచుకోట.   2009లో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు పోటీ చేయకుండా సోదరుడు వరుసయ్యే కృష్ణుడుని బరిలో దించారు. కృష్ణుడు సైతం ఓడిపోయారు. దీంతో ఈ సారి కృష్ణుడుకు సీటు ఇస్తే మళ్ళీ పార్టీ ఓడిపోతుందనే భ‌యంతో యనమల  తన కుమార్తె దివ్యకు సీటు ఇప్పించుకున్నారు.  దీంతో య‌న‌మ‌ల కుటుంబంలో చిచ్చు ర‌గిలింది. తన సోదరుడు కుమార్తె కోసం తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీశాడంటూ  కృష్ణుడు వైసీపీలో చేరారు. 

2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసారు. ఆయన పైన వైసీపీ అభ్యర్దిగా దాడిశెట్టి రాజా గెలిచారు. ప్రస్తుతం రాజా మంత్రిగా ఉన్నారు. మ‌ళ్ళీ ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని రాజా ఆశ ప‌డుతున్నారు.  

టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీలో ఉన్నారు.  టీడీపీ, జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే, మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.  కాపు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు  ఓటర్ల ను ప్రభావితం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్ది దాడిశెట్టి రాజా పైనే వదిలేసారు. దీంతో, తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది. 

వైసీపీకి రాజకీయ సమాధి కట్టే సమయం వచ్చిందని తుని టీడీపీ అభ్య‌ర్థి యనమల దివ్య ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రావణ కష్టం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అంతా అవినీతి దోపీడితోనే ప రిపాలన సాగుతుందన్నారు.  యనమల కృష్ణుడు ప్ర‌భావం ఏమేర‌కు వుంటుంది? కృష్ణుడికి, రాజాకు మ‌ధ్య ఏం ఒప్పందం కుదిరిందంటూ స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

చాణ్య‌క్య స్ట్రాట‌జీ టీం తునిలో నిర్వ‌హించిన స‌ర్వేలో 46 శాతం ఓట‌ర్లు టీడీపీకి అనుకూలంగానూ, వైసీపీ కేవ‌లం 41 శాతం ఓట‌ర్లు అనుకూలంగా మాట్లాడారు. అయితే అభ్య‌ర్థుల వారీగా ఓట‌ర్ల అభిప్రాయాల‌ను సేక‌రించిన‌ప్పుడు య‌న‌మ‌ల దివ్య‌కు అనుకూలంగా 54 శాతం, దాడిశెట్టి రాజాకు అనుకూలంగా కేవ‌లం 38 శాతం ఓట‌ర్లు మాత్ర‌మే మాట్లాడారు. జ‌గ‌న్ పాల‌న ఎలా వుంద‌నే ప్ర‌శ్న‌కు తుని ఓట‌ర్లు స్పందిస్తూ బాగానే వుంద‌ని 32 శాతం, అస్స‌లు బాగాలేద‌ని 59 శాతం ఓట‌ర్లు స్పందించారు.

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.
ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు.
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.