త్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. బాదుడే బాదుడు నిరసనలో పాల్లొనేందుకు శ్రీకాకుళం జిల్లా దళ్లవలసకు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో దిగింది మొదలు చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ లేదన్న తమ భావనను ఎలుగెత్తారు. గత ఎన్నికలలో ఎక్కడైతే జగన్ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిందో అక్కడే జగన్ కు జనం నీరాజనం పలకడం గమనార్హం. ఈ పర్యటనలో బాబుకు దక్కిన ఘనస్వాగతం చూస్తే..జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
స్వతహాగా తెలుగుదేశంకు గట్టి పట్టున్న ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో జగన్ హవా వీచింది. ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వచ్చిన జగన్ ను అప్పుడు జనం విశ్వసించారు. అయితే మూడేళ్ల పాలన అనంతరం సీన్ రివర్స్ అయ్యింది. ఆ విషయం బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రస్ఫుటంగా కనిపించింది. బాబు రాకతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
ఇక దళ్ల వలసలో బాదుడే బాదుడు నిరసన సభలో చంద్ర బాబు ప్రసంగానికి అడుగడుగునా స్పందన కనిపించింది.
వైసీపీ సర్కారు పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో దళ్లవలసలో బుధవారం రాత్రి జరిగిన నిరసనలో నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పుడు జనం పశ్చాత్తాపపడుతున్నారి చంద్రబాబు చెప్పారు. అధికార బలం, అహంకారంతో జగన్ విర్రవీగుతున్నారని చంద్రబాబు తూర్పారపట్టారు. తన ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు.. అసెంబ్లీలోనే తనను అవమానపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా అవమానపరచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కంటే కూడా జగన్ డేంజర్ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జనంలో మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలను భారీగా పెంచారని, విద్యుత్ ఉండదు గానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు మాదిరిగా ఉన్నాయన్న ఆయన ఆరోపణలకు జనం నుంచి మంచి స్పందన లభించింది.
జగన్ మాదిరిగా తాను దోచుకోనూలేదు, దాచుకోనూ లేదని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన సభ విజయవంతం కావడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బాబు సభకు జన స్పందన చూస్తే తెలుగుదేశం దూకుడు జగన్ పార్టీనీ, ప్రభుత్వాన్నీ బెంబేతెత్తించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-uyyarandhra-tour-successfear-mounts-in-jagan-25-135443.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.