చంద్రబాబు రామోజీని స్వయంగా పిలుస్తారా? పవన్ ను అవమానించినట్లేనా?
Publish Date:Oct 19, 2015
Advertisement
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పిలుపుల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పిలుపుల వ్యవహారం ఏమో కాని దీనివల్ల చంద్రబాబుకు రాజకీయ విభేధాలు తలెత్తుతాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ను స్వయంగా పిలిచారు చంద్రబాబు అలాగే జగన్ ను కూడా పిలవచ్చు కదా అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రామోజీరావుకు ఆహ్వానం అందించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో విభేదాలు తెలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రామోజీరావును చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ పార్టీలకు మద్దతుగా ఉండి వాళ్ల ప్రచారంలో తోడుండి వాళ్ల గెలువడానికి ఒకింత ముఖ్యభూమికను పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతి అందరికి తెలిసిన విషయమే.. మరి అలాంటి పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రుల చేత ఆహ్వానం పంపించి ఇప్పుడు రామోజీరావును కలిసి ఆహ్వానిస్తే చంద్రబాబు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎంటో చంద్రబాబుకు తెలిసిందే. మరి అలాంటప్పుడు చంద్రబాబు రామోజీరావును స్వయంగా ఆహ్వానించి పవన్ తప్పు చేస్తారా అన్న ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-39-51350.html





