నెల్లూరు జిల్లాల్లో పార్టీ ఓటమికి అసలు కారణాలు తెలుసుకుని షాక్ అయిన చంద్రబాబు.....

Publish Date:Oct 17, 2019

Advertisement

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు. తూర్పు గోదావరితో మొదలైన ఈ పర్యటన విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి.

రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒకెత్తయితే నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని చంద్రబాబు నేతలు అడిగారు. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.

పార్టీ ఇంతగా నష్టపోవటానికి కారణాలు ఏంటి అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు. అయితే కొంత మంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారు.

పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని తప్పులన్నీ మీరే చేసి మమ్మల్ని అడగటం బాగోలేదని కొందరు వాదనలు వినిపించారు. కొన్ని నియోజకవర్గాలు అభ్యర్ధులను మార్చాలనీ ఎన్నికల ముందు పదేపదే చెప్పినా పట్టించుకోలేదని ఏక పక్షంగా అభ్యర్ధులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తలు వాపోయారు.

ఇప్పుడు తాము వద్దన్నా నేతల్లో పోటీలోకి దించి వారు ఓడిపోతే తమనడగటం బాలేదని అన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీకి అరవై ఒక్క వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకొని క్యాండిడేట్ ను మార్చమని పదేపదే విజ్ఞప్తలు చేసినా పట్టించుకోలేదని దాని ఫలితమే అరవై ఒక్క వేల మెజార్టీ అని చెప్పారు. ఎన్నికల ముందు రిజల్ట్ ఊహించి చెప్తే అధిష్ఠానం పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారు.

అధిష్టానం తప్పులు చేసి ఇప్పుడు సమీక్షల పేరిట తాము తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండ బద్దలు కొట్టారని తెలుస్తుంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాలు వస్తే పక్క పార్టీ చెంత చేరటానికి  నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్ష సమావేశాలు వాడీవేడిగా జరిగాయని తెలుస్తోంది. ఇవి విన్న చంద్రబాబు ఇక పై ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి. 

By
en-us Political News

  
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.