పరుగులు తీయాలి ఓ నేతలూ ఉరకలు వేయాలి.. చంద్రబాబు దిశా నిర్దేశం

Publish Date:Aug 19, 2022

Advertisement

వచ్చే ఏన్నికలలో  టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన   శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.

నియోజకవర్గాల వారీగా టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకు ఐదు నియోజకవర్గాల వంతున సమీక్షించి, నేతలను ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఇన్ చార్జిలతో వేర్వేరుగా చిట్ చాట్ లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీల బలా బలాలు, రాజకీయ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. తాజాగా చేయించిన సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు ఇస్తుండడం విశేషం.

మరో పక్కన 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి దూరం అయిన చంద్రబాబు ఈ మధ్య కాలంలో మళ్లీ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం విశేషం. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను అవమానించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు వచ్చే ఎన్నిక తల బొప్పి కట్టించి, బొమ్మ కనిపించేలా చేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు లేదా పొత్తు కుదుర్చుకునే వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన మొన్నటికి మొన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘పై ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు చంద్రబాబుతో చేయి కలిపి మరీ ప్రధాని మోడీ ప్రత్యేకంగా చర్చించడం అందరినీ ఆకర్షించింది. త్వరలోనే మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం.

నిజానికి ఏపీలో టీడీపీ తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేందుకు చంద్రబాబు సర్వేలు చేయిస్తుంటారు. దాంతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు సొంత టీమ్ తో సర్వేలు చేయిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈసారి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీంతో కూడా ఆయన సర్వే చేయించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

అలాగే లోకేష్ టీం మరో సర్వే చేయించిందంటున్నారు. ఈ మూడు సర్వేల్లో కూడా 40 నియోజకవర్గాల్లో టీడీపీ- వైసీపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయంటున్నారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు తన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పుడు అలాంటి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మే 29, 29 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఊహలకు మించి  సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అదే స్ఫూర్తితో ఏపీ వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు, శ్రేణుల్లో కూడా హుషారు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తమ అధినేత నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

టీడీపీ అభ్యర్థుల విషయంలో దూకుడు ప్రదర్శించాలని, ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనే యోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. దాంతో పాటు లోకేష్ కూడా దూకుడు పెంచారనీ, సీఎం జగన్ రెడ్డి రహస్యాలను బహిర్గతం చేసేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జగన్ కు సంబంధించిన అతిపెద్ద కుంభకోణం బయట పెడతానంటూ లోకేష్ ఇటీవల ప్రకటించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఒక పక్కన, నారా లోకేష్ మరో పక్కన టీడీపీని బలోపేతం చేస్తూనే.. అధికార వైసీపీ విధానాలపైన నిరంతరం పోరాటం చేయాలని పథకం రూపొందించారట. తద్వారా వచ్చే ఎన్నికలను తమకు సానుకూలం చేసుకుకేందుకు పక్కా ప్రణాళికతో వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.