పరుగులు తీయాలి ఓ నేతలూ ఉరకలు వేయాలి.. చంద్రబాబు దిశా నిర్దేశం

Publish Date:Aug 19, 2022

Advertisement

వచ్చే ఏన్నికలలో  టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన   శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.

నియోజకవర్గాల వారీగా టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకు ఐదు నియోజకవర్గాల వంతున సమీక్షించి, నేతలను ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఇన్ చార్జిలతో వేర్వేరుగా చిట్ చాట్ లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీల బలా బలాలు, రాజకీయ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. తాజాగా చేయించిన సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు ఇస్తుండడం విశేషం.

మరో పక్కన 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి దూరం అయిన చంద్రబాబు ఈ మధ్య కాలంలో మళ్లీ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం విశేషం. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను అవమానించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు వచ్చే ఎన్నిక తల బొప్పి కట్టించి, బొమ్మ కనిపించేలా చేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు లేదా పొత్తు కుదుర్చుకునే వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన మొన్నటికి మొన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘పై ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు చంద్రబాబుతో చేయి కలిపి మరీ ప్రధాని మోడీ ప్రత్యేకంగా చర్చించడం అందరినీ ఆకర్షించింది. త్వరలోనే మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం.

నిజానికి ఏపీలో టీడీపీ తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేందుకు చంద్రబాబు సర్వేలు చేయిస్తుంటారు. దాంతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు సొంత టీమ్ తో సర్వేలు చేయిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈసారి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీంతో కూడా ఆయన సర్వే చేయించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

అలాగే లోకేష్ టీం మరో సర్వే చేయించిందంటున్నారు. ఈ మూడు సర్వేల్లో కూడా 40 నియోజకవర్గాల్లో టీడీపీ- వైసీపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయంటున్నారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు తన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పుడు అలాంటి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మే 29, 29 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఊహలకు మించి  సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అదే స్ఫూర్తితో ఏపీ వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు, శ్రేణుల్లో కూడా హుషారు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తమ అధినేత నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

టీడీపీ అభ్యర్థుల విషయంలో దూకుడు ప్రదర్శించాలని, ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనే యోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. దాంతో పాటు లోకేష్ కూడా దూకుడు పెంచారనీ, సీఎం జగన్ రెడ్డి రహస్యాలను బహిర్గతం చేసేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జగన్ కు సంబంధించిన అతిపెద్ద కుంభకోణం బయట పెడతానంటూ లోకేష్ ఇటీవల ప్రకటించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఒక పక్కన, నారా లోకేష్ మరో పక్కన టీడీపీని బలోపేతం చేస్తూనే.. అధికార వైసీపీ విధానాలపైన నిరంతరం పోరాటం చేయాలని పథకం రూపొందించారట. తద్వారా వచ్చే ఎన్నికలను తమకు సానుకూలం చేసుకుకేందుకు పక్కా ప్రణాళికతో వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.