Publish Date:May 20, 2024
ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని... అయితే, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోబోతోందని చింతా మోహన్ తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 150కి మించి సీట్లు రావని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-cm-again-congress-leader-chintamohan-39-176392.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.