చంద్రబాబు నిర్ణయంతో జగన్ కు తిప్పలు

Publish Date:Sep 21, 2015

Advertisement

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించో, అంతే స్థాయిలో ఏపీ ప్రభుత్వంలో పెను కదిలిక తెచ్చింది, ట్యాపింగ్ ఎపిసోడ్ తో ఉలిక్కిపడిన చంద్రబాబు, ఇదంతా హైదరాబాద్ లో ఉండటం వల్లే జరిగిందని నిర్ధారణకు వచ్చారు, ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పదేళ్లపాటు పాలన సాగించేందుకు ఏపీకి అధికారులున్నా, ఏదో తెలియని భయాందోళనలను టీడీపీ నేతల్లో నింపింది. అదే సొంత రాష్ట్రం నుంచే పాలన జరుగుతూ ఉంటే,  ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉండేది కాదని, టెక్నికల్ గానూ అది సాధ్యపడకపోయేదని గుర్తించారు. పైగా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలంటే, విజయవాడ ప్రాంతానికి త్వరగా తరలివెళ్లడమే మంచిదని భావించిన చంద్రబాబు...ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు.


అయితే ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని అధికారంలోకి వచ్చిన మూడ్నెళ్లలోనే నిర్ణయం తీసుకున్నా, అనేక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు, కానీ ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ దెబ్బతో తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు, అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వారంలో నాలుగైదు రోజులు విజయవాడలో ఉంటూ పాలన సాగిస్తూ, సమీక్ష నిర్వహిస్తుండటంతో, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ నుంచి బెజవాడకు షిఫ్ట్ అవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దాంతో జగన్ కూడా తన కార్యకలాపాలను విజయవాడ లేదా అమరావతి సమీప ప్రాంతం నుంచి సాగించాలని డిసైడ్ అయ్యారట. ఈలోపు చంద్రబాబు మాదిరిగా వారంలో మూడు నాలుగు రోజులు ఏదో ఒక అంశంపై ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా, అమరావతి ఏరియాకి షిఫ్ట్ అయితేనే ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్ధంగా పోరాడొచ్చని భావిస్తున్నారట. అందుకే, విజయవాడ, అమరావతి పరిసరాల్లో మంచి ఇల్లు కోసం జగన్ అన్వేషిస్తున్నారని, అన్నీ కుదిరితే సంక్రాంతి నాటికే మకాం మార్చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

 

అయితే ఏదోరోజు విజయవాడ ప్రాంతానికి దుకాణం మార్చాల్సి ఉన్నా, ఇంత అర్జెంట్ గా నిర్ణయం తీసుకోవడానికి మాత్రం చంద్రబాబే కారణమట, బాబు ఎక్కువగా బెజవాడలోనే ఉంటుండటంతో ప్రతిపక్ష నేత జగన్ కూడా షిఫ్ట్ కావాల్సిన అనివార్యత ఏర్పడిందని, ఆ విధంగా జగన్... బాబు ఉచ్చులో పడ్డారని అంటున్నారు. అయితే సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్... తరుచుగా కోర్టులకు హాజరుకావాల్సి ఉండటంతో...విజయవాడకు షిఫ్ట్ అవడం ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు. చంద్రబాబుకైనా, జగన్ కైనా హైదరాబాద్ ను పూర్తిగా వదిలివెళ్లాలంటే కొంచెం కష్టమేనేమో

By
en-us Political News

  
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.