చంద్రబాబు, కిరణ్ ప్రసంగాల తీరు ఎట్టిదనినా..

Publish Date:Mar 12, 2014

Advertisement

 

ఈ రోజు (బుదవారం) వైజాగ్ లో తెదేపా ప్రజా గర్జన సభ, రాజమండ్రీలో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యంద్ర పార్టీ సభ జరిగాయి. కిరణ్ సభతో పోలిస్తే తెదేపా సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. కిరణ్ ఇంకా రాష్ట్రం పూర్తిగా విడిపోలేదని, సమైక్యంగా ఉంచే అవకాశం ఉందని చెపితే, చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక ఇక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉందని చెప్పడం విశేషం. ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పటికీ, కిరణ్ మాత్రం ఈసారి కూడా సోనియా, రాహుల్ జోలికి పోకుండా విభజన గురించే మాట్లాడి సరిపెట్టేసారు. అయితే కొంచెం దైర్యం చేసి సోనియమ్మ పెద్దమ్మ అని సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని, వారిద్దరూ కలిసి రాష్ట్ర విభజన చేసారని అనగలిగారు.

 

చంద్రబాబు మాత్రం షరా మామూలుగా సోనియాను అవినీతి అనకొండ అని, రాహుల్ గాంధీ అసమర్దుడని, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో రోబోట్ వంటి వారని, ఆయన కంటే రజనీ కాంత్ రోబోట్ అయితే ఇంకా సమర్ధంగా పనిచేసేదని ఎద్దేవా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీని పది తలల రావణాసురుడితో పోల్చి వాటిలో జగన్, కిరణ్, కేసీఆర్, బొత్స ఇతర కాంగ్రెస్ నేతలు అందరూ ఒక్కో తలవంటి వారని, ఒక తలనరికితే మరొక కొత్త తల పుట్టుకొస్తూనే ఉంటుందని అందువల్ల, దానిని ప్రజలు రానున్న ఎన్నికలలో పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప దానికి అంతం ఉండదని అన్నారు.

 

ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా తమ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వల్లెవేసారు. కిరణ్ తను పదవి చెప్పట్టేనాటికి రాష్ట్రం అప్పులలో కూరుకు పోయుందని, కానీ తాను కేవలం ఒకటి రెండేళ్ళలోనే తిరిగి గాడిన పెట్టగలిగానని చెప్పారు. అయితే తన సమర్ధతను గురించి చెప్పుకొనే ఆత్రంలో అంతకు ముందు కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలించిందన్న సంగతి మరిచిపోయారు. అంటే వైయస్సార్ పాలన సరిగ్గా లేదని ఆయనే స్వయంగా ద్రువీకరించినట్లయింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కిరణ్ మాట్లాడినా దాని గురించి లోతుగా వెళ్ళే దైర్యం చూపకపోవడంతో ప్రజల నుండి ఎటువంటి స్పందన రాలేదు. కానీ, అదేవిషయం గురించి ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు ప్రజల నుండి మంచి స్పందన కనబడింది. కిరణ్, తనకు బాగా పట్టున్న గణాంకాలను తన ప్రసంగంలో వల్లే వేయడం వలన అది చాలా నిరాసక్తంగా మారింది. చంద్రబాబు పదేపదే తన గొప్పలు చెప్పుకోవడం కూడా కొంచెం అతిగా కనిపించింది.

 

చంద్రబాబు ఇద్దరూ కూడా తమకు పదవీ, అధికారాల మీద మమకారంలేదని కేవలం తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ఈ భాద్యతను తమ భుజాల మీద వేసుకొన్నామని అన్నారు. కిరణ్ తాను ప్రజల కోసం తన అధిష్టానాన్నే ధిక్కరించి పదవిని తృణ ప్రాయంగా వదులుకొన్న త్యాగాశీలినని, మిగిలిన ముగ్గురూ-చంద్రబాబు, జగన్ మరియు కేసీఆర్ లు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు, అవసరాలు, కోర్కెలు, పదవీ కాంక్ష లేవని, తనను, తన పార్టీని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలు కష్టాలలో ఉన్నందునే ముందుకు వస్తున్నానని తెలుపుతూ, మిగిలిన ముగ్గురూ-కేసీఆర్, కిరణ్, జగన్ కాంగ్రెస్ తరపున పనిచేస్తున్న డమ్మీ నేతలని ఎద్దేవా చేసారు.

 

కిరణ్ తనపార్టీ తరపున యువకులను ఎన్నికలలో నిలబెడతానని చెపితే, చంద్రబాబు బీసీ, యస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. కిరణ్ తనకు 25 యంపీ సీట్లు ఇస్తే, కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెపితే, చంద్రబాబు ఆంధ్ర, తెలంగాణాలలో తన యంపీలందరినీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రెండు రాష్ట్రాల పునర్నిర్మాణానికి అవసరమయిన నిధులు తీసుకు వచ్చి రెండు రాష్ట్రాలని విదేశాలకు తీసిపోని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.

 

చంద్రబాబు హామీలు, ప్రసంగం నిర్మాణాత్మకంగా, ఆశాజనాకంగా ప్రజలకు భరోసా ఇస్తూ సాగగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగంలో అటువంటివేమీ కనబడలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర పునర్నిమాణం గురించి ఎక్కువగా మాట్లాడితే, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తాను కనబరిచిన నిబద్దత, పోరాట పటిమ గురించే ఎక్కువ మాట్లాడారు. ఆయన నేటికీ సమైక్య కార్డుతో గేమ్ ఆడుతున్నారు గనుక తన పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేసుకొన్నారు. దాని గురించి మాట్లాడితే ఆయన చేస్తున్న సమైక్యవాదానికి అర్ధం లేకుండా పోతుంది.

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.