చంద్రబాబు సరికొత్త వ్యూహం ఫలించేనా?

Publish Date:Mar 11, 2013

Advertisement

 

నిన్న చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఈ సారి ఎన్నికలకి ఆరు నెలలు ముందుగానే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియను మొదలుపెడతామని ప్రకటించారు. ఇది తేదేపాకు సరికొత్త ఎత్తుగడగా ఆయన అభివర్ణిస్తున్నపటికీ, ఇటీవల కొంత కాలంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తినీ, తనకు వ్యతిరేఖంగా తోక జాడిస్తున్న సీనియర్లను, పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ వైపు దూకుతున్న అసంతృప్తి నేతలనూ అందరినీ ఏక కాలంలో తన దారికి తెచ్చుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును.

 

సాధారణంగా రాజకీయపార్టీలు టికెట్లు కేటాయించడం మొదలుపెట్టగానే, సహజంగానే పార్టీలో మళ్ళీ క్రమశిక్షణ, అధిష్టానం పట్ల వినయ విదేయతలు పెల్లుబుకుతాయి. (ఆ కార్యక్రమం తరువాత టికెట్ రాని అభ్యర్ధుల అలకలు, వేరే పార్టీకి వలసలు కూడా సహజమే.) అందువల్ల నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో పార్టీలో అసమ్మతి చాలా త్వరగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.

 

గత ఆరు నెలలుగా ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా తిరుగుతూ చేస్తున్న పాదయాత్రల వల్ల, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై తన దృష్టి కేంద్రీకరించ(లే)క పోవడంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే బహుశః ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. ‘ఎన్నికలకి ఆరు నెలల ముందుగానే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడతాము,’ అన్న ప్రకటనలో ఆయన ఇచ్చిన ‘టైమింగ్’ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే. ఎందుకంటే, ఆయన పాదయాత్ర ముగిసే సరికి మరో రెండు నెలలయినా పట్టే అవకాశం ఉంది. అంటే మే నెలలో ఆయన పాదయాత్ర ముగించుకొని మళ్ళీ తన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది.

 

ఇక ప్రతిపక్షాలవారు ఎంత మధ్యంతర ఎన్నికల ఊహా గానాలు వినిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో లేదా ఇంకా ఆలస్యంగా ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే, 9 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు కూడా జరిగే ఆ సమయంలో కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు కూడా వెళ్ళే సాహసం చేయకపోవచ్చును. అంటే చంద్రబాబు తన పాదయాత్ర ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి సరిగ్గా ఆరు నెలల సమయం ఉంటుందన్నమాట.

 

అందువల్ల చంద్రబాబు తిరిగి తానూ పార్టీ కార్యాలయానికి వచ్చిన తరువాత అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని ఆశ చూపడం ద్వారా ఆయన తన పాదయాత్ర సాగుతున్నంత కాలం పార్టీలో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. సర్వరోగ నివారిణి అయిన ఈ దివ్యౌషద ప్రభావం త్వరలోనే పార్టీపై తప్పక కనిపిస్తుంది. ఆయన తన పాదయాత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితులను తన అదుపులో తెచ్చుకొనే ప్రయత్నాలు ఎలాగు చేస్తారు. కానీ, అంతవరకూ పార్టీని అదుపులో ఉంచడానికి ఇంతకంటే దివ్యౌషదం మరొకటి ఉండదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆయన ఈ ‘ఎన్నికలు-అభ్యర్ధుల ఎంపిక’ అనే మందు వాడి ఉంటారు.

 

ఇక, ఈ ప్రకటన వెనుక ఆయన ఉద్దేశ్యాలు ఏవున్నపటికీ, ఆయన దానిని అమలు చేసినప్పుడు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఏర్పడుతాయి. పార్టీ అభ్యర్ధులను ఆరు నెలలు ముందుగానే ప్రకటించడం వలన, టికెట్ ఇచ్చిన నేతలకే సదరు నియోజక వర్గాల భాద్యతలు అప్పజెప్పడం ద్వారా అక్కడ పార్టీ విజయావకాశాలు పెరగవచ్చును. అదే సమయంలో, తమకు వ్యతిరేఖంగా పనిచేసే అసమ్మతి నేతలను లొంగ దీసుకొనే తిప్పలు కూడా సదరు అభ్యర్ధులే పడక తప్పదు గనుక, చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా పైపైనుండి పార్టీని పర్యవేక్షిస్తూ ఎన్నికలకు సిద్ధం కావచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.