ముళ్ళ కిరీటం ధరించనున్న కేసీఆర్, చంద్రబాబు

Publish Date:May 27, 2014

Advertisement

 

ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో అధికారం దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల యుద్దంలో విజేతలుగా నిలిచిన తెరాస, తెదేపాలు త్వరలో అధికారం చెప్పట్టబోతున్నాయి. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంతత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే వారిరువురు ఇంతగా పోరాడి గెలుచుకొన్న ఆ అధికారం వారికి పూలబాట మాత్రం కాదు. రాష్ట్రవిభజనతో ఊహించని అనేక సమస్యలు ఎదుర్కోబోతున్న వారిరువురికీ ముఖ్యమంత్రి పదవులు ముళ్ళ కిరీటం వంటివే. అయితే అది ధరించాలని వారే కొరుకొన్నారు గనుక, దానిని వారు చిరునవ్వుతో భరించవలసి ఉంటుంది.

 

మొదటగా జూన్ 2న కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోతున్నారు. 15మందితో ఏర్పాటుచేయబోయే ఆయన మంత్రివర్గంలో ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, తెరాస నేత ఈటెల రాజేందర్ తదితరులు ముఖ్యమయిన మంత్రిపదవులు పొందబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభుత్వ బాధ్యతలు చేప్పట్టిన తరువాత మళ్ళీ కొన్ని వారాలు లేదా నెలల తరువాత అవసరాన్ని బట్టి మరికొందరిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

 

ఆయన విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి నీళ్ళు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలపై మొదట దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణాలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలను అడుగు పెట్టనీయమని ఆయన ముందే ప్రకటించడం వలన, ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను స్థాపనకు క్రుశిచేయవలసి ఉంటుంది. అయితే అది అంత తేలికగా అయ్యే పని కాదు. దేశ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చెప్పట్టిన నరేంద్ర మోడీ, దేశ ఆర్ధిక వ్యవస్థపై పూర్తి పట్టు సాధించే వరకు బహుశః పెద్ద పెద్ద ప్రాజెక్టులను మంజూరు చేయకపోవచ్చును. అందువల్ల కేసీఆర్ తప్పనిసరిగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పతి సంస్థలకు ఆహ్వానం పలకవలసి ఉంటుంది.

 

ఇక వ్యవసాయానికి నీళ్ళు అందించాలంటే దానికి భారీ ప్రణాళికలు అవసరం. అయినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నఅంశమే కనుక దీని అమలుకు కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించవచ్చును. ప్రస్తుతం తెలంగాణకు ఆర్ధికంగా లోటు లేదు గనుక ఉద్యోగుల క్రమబద్దీకరణ, సంక్షేమ కార్యక్రమాలు వగైరా కూడా కేసీఆర్ మెల్లగా చేప్పట్టవచ్చును.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూన్ 8 ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారనే విషయం ఇంకా బయటకు పొక్కనివ్వలేదు. ఆయన కూడా మొదట చిన్న 15-20 మంది సభ్యులతో కూడిన చిన్న మంత్రివర్గంతోనే బాధ్యతలు చేప్పట్టి, ఆ తరువాత క్రమంగా విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కేసీఆర్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు చాలా క్లిష్ట పరిస్తితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్దికసమస్యలకు తోడు, ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీలు, వివిధ సంక్షేమ పధకాల అమలు, కొత్త రాజధాని నిర్మాణం, హైదరాబాదు-గుంటూరు మధ్య తిరుగుతూ పరిపాలన సాగించవలసి రావడం వంటి అనేక సమస్యలున్నాయి.

 

వీటన్నిటినీ అమలు చేయాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం ఉంది. అందుకే ఆయన వారంలో ఒకరోజు డిల్లీ కూడా వెళ్లేందుకు యోచిస్తున్నారు. అయితే కేంద్రం నుండి నిధుల విడుదలలో జాప్యం అనివార్యం గనుక అంతవరకు ఆయన ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం గట్టిగా చేయవలసి ఉంటుంది. కానీ అందుకోసం ప్రజల మీద కొత్త పన్నులు వడ్డించే ఆలోచన చేస్తే మాత్రం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్, వైకాపాలకు అదొక ఆయుధంగా మారుతుంది. అందువల్ల చంద్రబాబు ఆర్ధికలోటుని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవలసి ఉంటుంది. ఆ పనిని ఆయన ఎంత త్వరగా, సమర్ధంగా చేయగలరనేదే ఆయన కార్యదక్షతకు పరీక్షగా భావించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.