చంద్రబాబు! పాదయాత్రకి ముందు తరువాత

Publish Date:May 11, 2013

Advertisement

 

చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టే ముందు, కొనసాగుతున్నపుడు, పూర్తయిన తరువాత పూర్తి విభిన్నమయిన ఆలోచనా ధోరణి కనబరిచారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టే ముందు పార్టీపై తెలంగాణా ప్రభావం పట్ల చాలా ఆందోళన చెందారు. తెలంగాణా ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టే సమయానికే కేంద్రం తెలంగాణపై అఖిలపక్షం వేయడంతో ఆయన తమ పార్టీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా బయట పెట్టవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఆ ఆందోళన ఇంకా పెరిగింది.

 

అయితే, తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకొని, కేంద్రానికి ఆమేరకు లేఖ అందజేసిన తరువాత, సీమంద్రా ప్రాంతం నుండి దిక్కార స్వరాలూ వినిపిస్తాయని ఆందోళన చెందినప్పటికీ, ఆయన రెండు ప్రాంతాల నేతలతో ముందుగానే ఈ విషయంపై చర్చించి ఉండటంతో పార్టీలో ప్రశాంతత నెలకొంది. ఇక అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నందుకు తెలంగాణా ప్రాంతంలో ఆయన ఊహించిన దానికంటే మంచి సానుకూల స్పందన కనిపించడంతో, ఆయనలో మళ్ళీ మునుపటి ఉత్సాహం, ఆత్మ విశ్వాసం కనబడ్డాయి. పార్టీ అధినేతలో కనిపిస్తున్న ఆ మార్పుకి పార్టీ శ్రేణులు కూడా అంతే సానుకూలంగా స్పందించాయి. నిజం చెప్పాలంటే, ఆయన పాదయాత్ర ఆంధ్రా ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ప్రోత్సాహకరంగా ఉందని చెప్పవచ్చును.

 

పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన ఆయనకు, అక్కడ స్థానిక నేతలయిన కేశినేని, వల్లభనేని తదితర నేతల మద్య గొడవలు ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చాయి. ఆయన తాత్కాలికంగా సమస్యని సర్దుబాటు చేసినప్పటికీ అవి నివురుగప్పిన నిప్పులా మిగిలే ఉన్నాయి. ఆ తరువాత వరుసగా గుంటూరు, విశాఖ జిల్లాలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవడంతో ఆయన పార్టీ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందారు.

 

అదే సమయంలో వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో నందమూరి కుటుంబానికి, పార్టీకి మధ్య చిచ్చుపెట్టడంతో ఆయన ఏవిధంగా స్పందించాలో తెలియని పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. అయితే సరిగ్గా అప్పుడే బాలకృష్ణ రంగప్రవేశం చేసి వైకాపాకు, వారి వ్యుహలకు స్పందించని తన సోదరుడు హరికృష్ణకు, అతని కుమారుడు జూ.యన్టీఆర్ కు కొంచెం ఘాటుగానే జవాబు చెప్పి చంద్రబాబే తెదేపా నాయకుడని నిర్ద్వందంగా ప్రకటించి పార్టీలో నెలకొన్న అయోమయం దూరం చేసారు. ఆ తరువాతనే పార్టీ తిరిగి గాడిన పడిందని చెప్పవచ్చును.

 

అయితే వివిధ జిల్లా నేతల మద్య టికెట్స్ కోసం గొడవలు కొనసాగుతూనే ఉండటంతో, అసలు రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా లేమా? అనే అనుమానం కూడా వ్యక్తం చేసారంటే చంద్రబాబు ఎంతగా ఆందోళన చెందారో అర్ధం అవుతుంది. నేతలందరూ కుర్చీలలో కర్చీఫులు వేసి కూర్చొంటే పార్టీ టికెట్స్ దక్కవని అందరూ తమ విభేదాలు, స్వంత పనులను కూడా పక్కన బెట్టి పనిచేయకపోతే రాబోయే ఎన్నికలలో గెలవడం కష్టమని ఆయనే తేల్చి చెప్పారు.

 

ఆయన అంత కటువుగా చెప్పిన తరువాత నాయకులలో కూడా కొంత మార్పు కనబడింది. అంతవరకు పార్టీపై అలిగి దూరంగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి నేతలు దారిలోకి వచ్చి విశాఖలో పాదయాత్ర ముగింపు సభని అనుకొన్న దానికంటే ఘనంగా నిర్వహించారు. ఆ సభకు వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన కార్యకర్తలను, నేతలను, వేలాది ప్రజలను చూసిన తరువాత మళ్ళీ చంద్రబాబులో ఆత్మవిశ్వాసం, పార్టీ విజయం పట్ల నమ్మకం ప్రస్పుటంగా కనిపించాయి.

 

కొద్ది రోజుల క్రితం దాడి వీరభద్ర రావు, ఈరోజు కడియం శ్రీహరి ఇద్దరూ కూడా పార్టీని వీడినప్పటికీ, చంద్రబాబు “నేతలు పార్టీని వదిలిపోయినంత మాత్రాన్న మనమేమి భయపడనవసరం లేదు. పార్టీ కార్యకర్తలనుండి కొత్త నాయకులను మనం తయారు చేసుకొందాము. దానివల్ల పార్టీ మరింత బలపడుతుందని ధృడంగా చెప్పడం పార్టీ నేతలకు సైతం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా “పార్టీనుండి ఇంకా ఎంతమంది బయటకి పోవడానికి సిద్దంగా ఉన్నారో వారి పేర్ల లిస్టు కూడా తనవద్ద సిద్దంగా ఉందని, వారు కూడా వెళ్ళిపోతే కొత్త టీమును ఏర్పాటు చేసుకొంటానని” ఆయన చెప్పడం ఆయనలో స్పష్టమయిన మార్పు వచ్చినట్లు తెలియజేస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.