పాదయాత్రా ఫలం పార్టీకే అంకితం

Publish Date:Apr 26, 2013

Advertisement

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా 208 రోజులయింది. 63సం.ల వయసులో ఏకధాటిగా 2,817 కి.మీ దూరం నడవడానికి కేవలం ఒంట్లో ఆరోగ్యం ఒకటే సరిపోదు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలననే ఆత్మవిశ్వాసం, పట్టుదల కూడా ఉండాలి. అవి చంద్రబాబులో పుష్కలంగా ఉండబట్టే, ఆయన ఈ రోజు తన పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయగలిగారు.

 

గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా, హిందూపురంలో మొదలుపెట్టిన పాదయత్రలో ఆయన 16 జిల్లాలు, 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలలోగల వివిధ కులాలు, మతాలూ, జాతులు, వృత్తులు, తరగతుల ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరియు నేతలను స్వయంగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోగలిగారు. తద్వారా అధికారంలో ఉన్నపుడు వారితో ఏర్పడిన దూరాన్ని తొలగించుకొని మళ్ళీ వారికి చేరువకాగలిగారు. అదేవిధంగా ఆయనను స్వయంగా కలుసుకొన్న ప్రజలకు ఆయనపట్ల ఒక అవగాహన ఏర్పడింది.

 

ఈ పాదయాత్ర ద్వారా నాలుగు ముఖ్య ప్రయోజనాలు సిద్దించాయి. 1. ప్రజలకి చేరువగా పార్టీని తీసుకువెళ్ళడం. 2.పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవడం. 3.ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితి పట్ల ఆయన స్వయంగా అవగాహన పొందడం. 4.తనపట్ల, పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఏర్పరచడం.

 

తన పాదయాత్రలో చంద్రబాబు మారుమూల గ్రామాలలో పార్టీకోసం పనిచేసే అనామక కార్యకర్తలు మొదలుకొని నగరాలలో, పట్టణాలలో ఉండే నేతల వరకు అందరినీ స్వయంగా కలిసి మాట్లాడి మళ్ళీ వారిలో పోరాట స్పూర్తిని నింపగలిగారు. ప్రతీ జిల్లా పర్యటనలో నియోజక వర్గాల వారిగా పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతూ ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకొంటూ, పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసుకొంటూనే, మరో వైపు అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకం అవడంవలన పార్టీ పట్ల వారిలో సానుకూల వాతావరణం సృష్టించారు.

 

మంచి పరిపాలన దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు తన పాదయాత్రలో వివిధ జిల్లాలో పార్టీ పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలకి తగిన ప్రణాలికలు వ్యూహాలు రచించుకోగలిగే అవకాశం కూడా ఏర్పడింది. గ్రామస్థాయి నుండి పట్టణ, నగర స్థాయి వరకు ఉండే అనేక స్థానిక సమస్యలపట్ల ఆయన స్వయంగా అవగాహన పెంచుకోవడమే కాకుండా, వాటిని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియజేసే ఒక నిర్దిష్టమయిన జిల్లా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తూ ప్రజలని ఆకట్టుకొన్నారు.

 

అదేవిధంగా వివిధ జిల్లాలో పార్టీ నేతల మద్యన ఉన్న విబేధాలను తొలగించే ప్రయత్నాలు చేసారు. కొన్నిసర్దుబాట్లు, మార్పులు చేర్పులతో, అలిగిన నేతలకు కొన్ని తాయిలాలు, అవసరమయిన చోట క్రమశిక్షణా చర్యలు తీసుకొంటూ, గత 9ఏళ్లుగా అధికారానికి దూరమయి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నపార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేసారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఇందుకు పూనుకోవడంతో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవిధంగా పార్టీని అంతర్గతంగా బలపరుచుకోవడం చాలా మంచి ఆలోచనే.

 

అయితే ఈ పాదయత్ర ప్రభావం ప్రజల మీద, పార్టీ కార్యకర్తలు, నేతల మీద రాబోయే ఎన్నికలవరకు ఉంటుందా లేదా అనే సంగతిని పక్కన పెడితే, చంద్రబాబు తన తన పాదయాత్ర ద్వారా పార్టీని పటిష్టపరుచుకొని పార్టీ ప్రభావం ప్రజల మీద ప్రసరించేలా చేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. చంద్రబాబు పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ప్రజలకు సమర్ధంగా తెలియజేయగలిగారు. రాబోయే ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాదిస్తే ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసిన ఈ పాదయాత్రకు, ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కినట్లే భావించవచ్చును. .

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.