చంద్రయానంలో మరో కొత్త మైలు రాయి

Publish Date:Feb 11, 2013

Advertisement

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో నేడు మరో సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఈ రోజు గుంటూరు పట్టణంలో స్థానిక ఆర్.టీ.సి. బస్ స్టాండ్ వద్ద చేరుకోవడంతో ఆయన 2000 కిమీ పాదయాత్ర పూర్తవుతుంది. గత అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద తన పాదయాత్ర ఆరంబించిన చంద్రబాబు నాయుడు, ఇంతవరకు అనివార్యమయిన పరిస్థితుల్లో తప్ప ఈ ఐదున్నర నెలలూ ఎక్కడా ఆపకుండా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ 63 ఏళ్ల వయసులో ఆయన అంత దూరం నడవడం కూడా గొప్ప విషయమే.

 

ఆయన ఇంతవరకు 107 పట్టణాలు, 107 మండలాలు, 55 నియోజకవర్గాలు, 2 నగరాలలో పాదయత్ర చేసి 12 జిల్లాలలో పర్యటించి, ఇప్పుడు 13వ జిల్లా గుంటూరులో గత వారం రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు.

 

కాంగ్రెస్ పాలనలో దుర్బర జీవితం అనుభవిస్తున్న ప్రజలను పరమార్శించాడానికే పాదయాత్ర అని ఆయన చెపుతున్నపటికీ, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నం, తాపత్రయం కూడా అందులో ఉంది. ఇతర పార్టీలు కూడా ఆయన బాటలోనే ముందుకు సాగుతున్నపటికీ ఆ సంగతిని ప్రస్తావించకుండా, ఆయనను విర్శించడం అహేతుకం. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన తన పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రచారం చేసుకోవడంలో తప్పు ఏమి లేదు.

 

ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల మద్య ఉన్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను, తప్పుడు నిర్ణయాలను, వాటి ఫలితాలను గ్రామీణ ప్రజలకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరించి మరీ ఆ పార్టీని ఎండగట్టడం ద్వారా, జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి పదేపదే ప్రజలకు వివరించుతూ ఆ రెండు కాంగ్రెస్ పార్టీలకి తెలుగుదేశం పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం అనే భావన ప్రజలలో కల్పించేందుకు ఆయన చాల శ్రమించారు.

 

అయితే, ఆయన మాటలను ప్రజలు ఎంతవరకు విస్వశిస్తున్నారనేది ఎన్నికలు వచ్చి, ఫలితాలు వెలువడితే తప్ప తెలియదు. రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్న గ్రామీణ ప్రజలు ఏ రాజకీయ పార్టీ, నాయకుడు వచ్చినా, వారు నిర్వహించే సభలు, పాదయత్రాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందువల్ల ఈ రోజుల్లో ప్రజల నాడిని పట్టుకోవడం రాజకీయ పార్టీలకు సైతం కష్టం అవుతోంది.

 

అందువల్ల చంద్రబాబు తన సుదీర్ఘమయిన ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలను స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకొంటూ, అదే సమయంలో అక్కడి ప్రజలకు తెలుగుదేశం పార్టీని పునర్ పరిచయం చేస్తూ, తన కార్యకర్తలను కూడా స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలను తెలుసుకొంటూ తన పార్టీని ప్రజలతో మమేకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల తక్షణ ఫలితాలు కనబడకపోయినప్పటికీ, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి ఇది ఎంతో మేలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చును. ఇదే క్రమంలో, ఆయన వివిధ ప్రాంతాల నాయకుల మద్య తలయెత్తిన తీవ్ర విబేధాలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం కూడా ఆ పార్టీని బలోపేతం చేయవచ్చును.

 

రికార్డులు, మైలురాళ్ళ పట్ల ఆయనకీ ఆసక్తి లేకపోయినపటికీ, నిర్విరామంగా కొనసాగుతున్న ఆయన పాదయాత్రలో అటువంటివన్నీ సహజంగానే సిద్ధిస్తున్నాయి. అయితే, ఆరోగ్యం సహకరించనపటికీ, జనవరి 26వ తేదీతో ముగియవలసిన తన పాదయత్రను ఆయన ఇంకా కొనసాగించడం ఆయన కుటుంబ సభ్యులను, పార్టీని కలవరపరుస్తోంది. బహుశః 2000కిమీ. మైలు రాయి దాటుతున్న సందర్భంగా మళ్ళీ వారందరూ పాదయత్ర నిలిపివేయమని ఆయనపై మరోమారు ఒత్తిడి తేవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.