Publish Date:May 22, 2023
అవినాష్ ఇక అరెస్టు నుంచి తప్పించుకోలేరా? ఆఖరి ఆశగా ఆయన దాఖలు చేసుకున్నముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించడంతో ఇక సీబీఐ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ ను అరెస్టు చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయమని సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పడంతో సీబీఐ కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సీబీఐ అధికారులే చెబుతున్నారు. మరో వైపు అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. కర్నూలులోని అవినాష్ రెడ్డి స్నేహితుడి ఆస్పత్రి అయిన విశ్వభారతి ఆస్పత్రి వైద్యులపై అంతగా విశ్వాసం ఉంచని సీబీఐ ఆమెను వేరే వైద్యుల ఒపీనియన్ తీసుకునే దిశగా కూడా సీబీఐ యోచన చేస్తున్నది.
ఇలా ఉండగా ఇప్పటికీ విశ్వభారతి ఆస్పత్రి పూర్తిగా అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉండటంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అవినాష్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కర్నూలు ఎస్పీ చెప్పడాన్ని సీరియస్ గా తీసుకున్న సీబీఐ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వివరించి సూచనలు తీసుకుంటున్నారు. అవినాష్ తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆయనను అరెస్టు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇక అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోనికి దించైనా అదుపులోనికి తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం అవుతోంది.
ఇక అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తాత్సారంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘అవినాష్ రెడ్డిగారూ పిచ్చి చూపులు చూస్తున్న సీబీఐ మీద దయ చూపించడండి.. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రపంచానికే హీరోగా నిలబడిన ప్రధాని మోడీ చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి.. దయచేసి లొంగిపోండి’ అంటూ ఓ రేంజ్ లో నెటిజన్లు సీబీఐని ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సీబీఐ ఒక్కటొక్కటిగా అడ్డంకులను తొలగించుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్న సీబీఐని నిలువరించడానికా అన్నట్లు అవినాష్ రెడ్డికి ర క్షణ కవచంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బైఠాయించారు. వారితో పాటు హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని సీబీఐ బృందాలు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి నివేదించాయి. దీంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆమేరకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి కేంద్ర బృందాలు కర్నూలు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-forces-into-action-25-155726.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.