బీఎస్ఎన్ఎల్ నెత్తిన భస్మాసుర హస్తం

Publish Date:Jun 8, 2023

Advertisement

ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు. అది కూడా అత్యంత ఖరీదైన వస్తువుగా తెలుసు. అప్పట్లో వీధికి ఒక్క ఫఓన్ మాత్రమే ఉండేది.  గ్రామాలలో పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఇలాంటి సమాచార వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఫోన్ల స్థానంలో మొబైల్ ఫోన్లను తెచ్చాయి.

ఇప్పడు ప్రతి ఇంట్లో కనీసం అరడజను ఫోన్లు. టెలికాం విప్లవం మొబైల్ ఫోన్లతో ఆగిపోలేదు.  జనరేషన్ల పేరుతో తన సేవలను పెంచుకుంటూ ఇప్పుడు 5జీగా కొనసాగుతోంది. అలాంటి సమాచార విప్లవంలో భారత ప్రభుత్వం కూడా తన స్వంత సంస్థగా కోటి రూపాయల మూలధనంతో భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ప్రారంభించింది.  ప్రయివేటీకరణలో భాగంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తూ వచ్చిన భారత ప్రభుత్వం క్రమంగా బీఎస్ఎన్ఎల్ ను పక్కన పెట్టేసింది. భారత దేశంలో డిఫఎన్స్, రైల్వేస్ తరువాత అ త్యధిక మంది ఉద్యోగులను, ఆస్తులను కలిగిన బీఎస్ఎన్ఎల్ దివాళా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.

చివరికి బీఎస్ఎన్ ఎల్ అభివృద్ధి 3జి దగ్గరే ఆగిపోయింది.  మిగిలిన కార్పొరేట్ టెలికాం సంస్థలు లాభాల బాటలో నడుస్తుంటే భారత ప్రభుత్వంలోని బీఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలో చిక్కుకుంది.  తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ కు 89వేల కోట్ల రూపాయల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది.  దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి. 

ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 89 వేల కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీలో పలు కీలక అంశాలపై దేశంలో చర్చ సాగుతోంది.  బీఎస్ఎన్ఎల్ ను పలు రకాలుగా నష్టాలలోకి నెట్టి అప్పడప్పుడూ ప్యాజేపీలు ప్రకటించడాన్ని టెలికాం రంగ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒకటిన్నర శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత టెలికాం రంగానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం మితిమీరిన కార్పొరేట్ పలుకుబడే కారణమని విమర్శలు వస్తున్నాయి.  స్పెక్ట్రం లకు బీఎస్ఎన్ఎల్ ను దూరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడుు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం, వాటిని దొడ్డి దారిన కార్పొరేట్ల చేతుల్లోకి పంపడానికే అని విమర్శలు ఉన్నాయి. 

దేశంలో  సుమారు 36శాతం మంది గ్రామీణ ప్రజలు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ బ్రాడ్ బాండ్ లలో అధిక లాభాలు రావు కాబట్టి కార్పొరేట్లు ఆ వైపు చూడటం లేదు.  అయినా బీఎస్ఎన్ఎల్ ఇంత వరకూ 4జి సేవలను పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది.  లాభాలు తెచ్చే సేవలో పోటీ పడే కార్పొరేట్లు దేశంలోేని పేదల కోస నెట్ వర్క్ లు నడపడం లేదు.  సేవల ఏర్పాట్లపై టీసీఎల్ కు 15వేల కోట్లు చెల్లిస్తున్న బీఎస్ఎన్ఎల్, టాటాలను పెంచి పోషిస్తోంది. 4జి సేవల కోసం అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతికను కొర్పొరేట్లు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటే, చైనాపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇక్కడి పారిశ్రామిక వేత్తల నుండే టెక్నాలజీని కొనాల్సి వస్తోంది.

 దీంతో సేవలు అంతరాయానికి గురవుతున్నాయి. టెక్నాలజీ కొనుగోళ్ల పేరుతో దేశంలోని కార్పొరేట్లు ఆ డబ్బును కూడా దిగమింగుతున్నారు. దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికీ బీఎన్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 89వేల కోట్ల ప్యాకేజీ అటూ, ఇటూగా తిరిగి దేశీయ కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లబోతోంది అన్నది అక్షర సత్యం.

By
en-us Political News

  
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.