Publish Date:Jan 24, 2025
రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యను లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ను అలంబన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. వీసీల ఎంపిక, నియమకాలకు సంబంధించిన నిబంధనల సవరణకు యూజీసీ సమాయత్తమైంది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. యూజీసీ ప్రస్తుత మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తలు మాత్రమే వైస్ ఛాన్సలర్ పదవికి అర్హులౌతారు. అయితే కొత్త ప్రతిపాదన మేరకు పారిశ్రామిక రంగంలో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అదీ కాకపోతే పబ్లిక్ పాలసీ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిని కూడా వీసీల నియామకం విషయంలో పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంటుంది. అనుభవం ఉన్న నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని యూజీసీ ప్రతిపాదించింది.
ఏ విధంగా చూసినా ఈ ప్రతిపాదన ఉన్నత విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని కాలరా స్తాయ నడంలో సందేహం లేదు. ఈ ప్రతిపాదనలు రాజ్యాంగ మూల సూత్రాలకు, ఫెడరల్ స్ఫూర్తికీ పూర్తిగా విరుద్ధం. ఈ కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తాయి. ఈ కారణంగా యూజీసీ ప్రతిపాదనలను న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాన్ అకడమిక్ వీసీల నియామకం, రాష్ట్ర ప్రభుత్వాలకు వీసీలసెర్చ్ కమి టీలతో సంబంధం లేకుండా చేయడం వంటి ప్రతిపాదనలు నిజంగా ఆందోళనకరంగానే ఉన్నాయి.
చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు పావులా మార్చే ప్రయత్నమే ఇదన్న విమర్శలు విద్యాధికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న కుట్రలా ఈ ప్రతిపాదనలను చూడాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు, పౌర ప్రజా సంఘాలు, మేధావులు, రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-conspiracy-to-monopoly-on-higher-education-25-191767.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!