లోకేష్ ప్రస్తావన.. బాబు కళ్లల్లో మెరుపు చూసి తీరాల్సిందే!

Publish Date:Oct 26, 2024

Advertisement

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! 

సరిగ్గా సుమతీశతక కారుడు చెప్పినట్లుగా చంద్రబాబులో ఇప్పుడు పుత్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నందమూరి బాలకృష్ణ టాక్ షో  అన్ స్టాపబుల్ సీజన్ 4 శుక్రవారం (అక్టోబర్ 25)న ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. తన అరెస్టు, జగన్ అరాచకపాలన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తన విజన్..  ఇలా అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నాటి సంఘటనలను వివరిస్తున్నప్పుడు ఒకింత ఎమోషనల్ అయ్యారు. తప్పు చేయని తనను అరెస్టు చేయడమే కాకుండా ఆ సమయంలో తనను ట్రీట్ చేసిన విధానం కడుపు తరుక్కుపోయేలా చేసిందని చంద్రబాబు చెప్పారు.

ఇవన్నీ ఒకెత్తైతే.. తన కుమారుడు నారా లోకేష్ పాదయాత్ర గురించి బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్ర బాబు  సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన కళ్లలో ఆనందం, గర్వం ప్రస్ఫుటంగా కనిపించాయి. తన కుమారుడిగానో, ఎన్టీఆర్ మనవడిగానో, బాలయ్య మేనల్లుడిగానో కాకుండా తన కంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకత చాటుకోవాలని లోకేష్ భావించారనీ, అందుకే తాను వారించినా వినకుండా పాదయాత్ర చేశారని చంద్రబాబు చెప్పారు. తండ్రిగా తాను పాదయాత్ర వద్దనే చెప్పానన్నారు. ఒక విద్వేష పూరిత ప్రభుత్వం అధికారంలో ఉంది. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాదు అంతకు మించి ఏదైనా చేస్తారేమోనన్న భయం ఉంది. నేరుగా చెప్ప కున్నా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ పై వైసీపీ మూకలు భౌతిక దాడులకు పాల్పడతాయన్న భయం ఉందని చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. అయితే లోకేష్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారనీ, విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారని చంద్రబాబు చెప్పారు.  ఆయన చెప్పడమే కాదు.. రాష్ట్ర ప్రజానీకం నారా లోకేష్ లోని పరివర్తనలు చూశారు. ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్న తీరును చూశారు.  పరిపూర్ణమైన రాజకీయనాయకుడిగా, ప్రజా నేతగా లోకేష్ సర్వామోదం పొందారు. 

అయితే లోకేష్ కు ఈ సర్వామోదం అంత తేలిగ్గా రాలేదు.   నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే  ఆయనను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు జీవితబీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని చూశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వ్యక్తిత్వంపై దాడి చేయా లన్న కుట్రతో వ్యవహరించారు.  ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా వేటినీ వదలకుండా ఆయనను మానసికంగా కుంగదీయాలని చూశారు.  అయితే లోకేష్ కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎగిశారు. ఎదిగారు.

ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తి తో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. యువగళంతో తానేమిటో నిరూపించుకున్నారు.పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగిం చారు. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు..తండ్రిని మించిన తనయుడిగా జేజేలు అందుకుంటున్నారు.  అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ గురించి మాట్లాడుతూ గర్వంగా ఫీలయ్యారు. పుత్రోత్సాహం ఆయన కళ్లల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.