నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి ఫ్యామిలీ పార్టీ నిర్వహించారు. ఈ కుటుంబ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ పార్టీ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నవ్వుల పారిజాతాలు పూశాయి. ముఖ్యంగా చంద్రబాబు లోని హాస్యచతురత ఈ పార్టీలో అదనపు ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు చమత్కార బాణాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా దీటుగా హాస్యస్ఫోరకంగా ఇచ్చిన సంభాషణలు పార్టీలో నవ్వులు పూయించాయి.
ఈ పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబుకు మైక్ అందిస్తూ నారా భువనేశ్వరి ఇది రాజకీయ పార్టీ కాదు.. బాలకృష్ణ గురించి మాట్లాడండి, రాజకీయ ప్రసంగంలా గంటలతరబడి కాదు కేవలం ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడండి అంటూ టైమ్ లిమిట్ విధించారు. నవ్వుతూ మైక్ అందుకున్న చంద్రబాబు తానిప్పుడు ఇద్దరి మధ్యా ఇరుక్కు పోయానంటూ చమత్కరించారు. ఒక వైపు బాలా మరోవైపు భువనేశ్వరి మధ్యలో నేను అంటూ తన ప్రసంగం మొదలెట్టిన చంద్రబాబు వీళ్లిద్దరి మధ్యన ఉంటే చాలా డేంజర్ అన్నారు. ఆ తరువాత బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్నటిదాకా అల్లరి బాలయ్య… ఇప్పుడు పద్మభూషణుడు అన్న చంద్రబాబు, ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారనీ, అందుకు ఎంతో గర్వంగా ఉందనీ చెప్పారు. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం మా కుటుంబానికి గర్వకారమన్నారు.
అక్కడితో ఆగకుండా బాలకృష్ణ తనకంటే సీనియర్ అంటూ ఆటపట్టించారు. తన పొలిటికల్ కెరియర్ కంటే బాలకృష్ణ సినిమా కెరియరే ముందు మొదలైందన్నారు. ఇక బసవరామతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారంటూ బాలకృష్ణ ను పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ ఈ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టిన తరువాతే దేశంలో అగ్రగామి ఆస్పత్రులలో ఒకటిగా బసవరామతారకం ఆస్పత్రి నిలిచిందన్నారు. బాలకృష్ణ తరచుగా తన అర్ధాంగికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారనీ, అయితే ఆమెను మెప్పించడానికే ఆయన అలా చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-helarious-jokes-in-family-party-25-192259.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.