కడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే...

Publish Date:Sep 14, 2024

Advertisement

ఈకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది జీర్ణానికి సంబంధించినదే ఎక్కువ. చాలామంది తమకు తిన్న ఆహారం జీర్ణం కావడం లేదని, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది?? ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య ఏమి కాదు.  మొదటగా కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.


కడుపు ఉబ్బరం రావడానికి గల కారణాలు:- 


మలబద్దకం


సాధారణంగా మలబద్దకం సమస్య ఉన్నవారిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఎక్కువ. మలవిసర్జన అనేది సరిగా జరగకపోతే అది కడుపులో పేగుల మధ్య గట్టిగా మారిపోయి జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం తింటూనే ఉంటే ఒకవైపు మలవిసర్జన కూడా దానికి తగ్గట్టు జరిగిపోతుండాలి. లేకపోతే కడుపులో వాయువులు, వ్యర్థాలు పెరిగి అది ఉబ్బరానికి దారితీస్తుంది.


వేగంగా తినేవారికి


ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఆహారం చాలావరకు పిండి పదార్థంగా మారి జీర్ణశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అయ్యి ఎంతో సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది. కానీ చాలామంది పరిగెత్తాలనే తొందర ఉన్నట్టు వేగంగా తింటారు. దీనివల్ల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు సరైన విధంగా జీర్ణక్రియకు అనువుగా ఉండవు. ఫలితంగా కడుపు ఉబ్బరం చోటుచేసుకుంటుంది.


దంత సమస్యలు ఉన్నవారిలో


దంతాల సమస్యకు కడుపు ఉబ్బరానికి సంబంధం ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. అయితే దంతాల సమస్య ఉన్నవారిలో  రక్తం కారుతూ ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. ఇలా దంతాల వద్ద రక్తం కారడం జరిగినప్పుడు సహజంగా  తినే పదార్థాలతో, తాగే ద్రవాలతో కలసి జీర్ణశయం చేరుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.


ఆహార వేళలు


ఆహారం తీసుకోవడమే కాదు, ఆహార వేళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అస్తవ్యస్తమైన ఆహార వేళలు పాటించడం వల్ల జీర్ణశయం తీరు సరిగా ఉండదు. ఈ కారణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది.


నోటి శుభ్రత


జీర్ణాశయనికి సంబంధించి ఏ సమస్యకు అయినా ఎక్కువ శాతం నోటి శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోరు సరిగా శుభ్రం చేసుకోకుండా తినడం, తాగడం చేస్తే నోటిలో ఏర్పడ్డ బాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. 


పై కారణాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..


ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడంలో ఎలాంటి సమస్యా ఉండదు. 


కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్నప్పుడు గ్లాసుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.


 దంతాల సమస్యలు ఉన్నవారిలో ఆహారం నమలడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేస్తుంటారు. కాబట్టి ఆ సమస్యలకు వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి.


నోటి శుభ్రత లేకుండా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, భోజనం, బేకరీ పదార్థాలు అన్ని కలిపి ఒక్కసారి తీసుకోకూడదు. కొన్ని పదార్థాలు చాలా సులాభంగానూ, మరికొన్ని అలస్యంగానూ జీర్ణమయ్యే వాటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. 


కడుపు ఉబ్బరానికి పైన చెప్పుకున్న జాగ్రత్తసలు పాటించినా సమస్య  తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.