కులం ముద్రకు తెలుగుదేశం అతీతం

Publish Date:Mar 30, 2024

Advertisement

కులం పేరుతో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలన్న వైసీపీ యత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కులం రంగు అంటని పార్టీగా తనను తాను రుజువు చేసుకుంటూనే వస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీపై కులం ముద్ర వేయాలన్న ప్రయత్నాలు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రయత్నాలు జరిగాయి. ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణాల విషయంలో తన నిష్పాక్షికతను తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకుంటూ వస్తూనే ఉంది.  అయితే జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో  ఓటమి తరువాత  తెలుగుదేశం పార్టీని  కులతత్వ పార్టీగా చిత్రీకరించగలిగితేనే తమకు రాజకీయ ఉనికి ఉంటుందని జగన్ భావించారు. ఒక అక్కడ నుంచి అదే పనిగా రాజకీయ వ్యూహకర్తలు, సోషల్ మీడియా ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్  ఇలా ఒకటేమిటి అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశంకు కుల ముద్ర అంటగట్టడమే లక్ష్యంగా ముందుకు సాగిన జగన్ ఆ దిశగా ఓ మేరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి.   అయితే తెలుగుదేశం పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని  నిరూపించుకుంది.  

2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ  జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకం విషయంలో తెలుగుదేశం ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంది. జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఏ మాత్రం ఓటు స్టేక్ లేని ఆ పార్టీకి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలు కేటాయించడంపై పార్టీ వర్గాల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు అంతం పలకాలన్న లక్ష్యంతో నడుస్తున్న పార్టీ అధిష్ఠానం అభిప్రాయాలకు విలువ ఇచ్చిన క్యాడర్ ఓ మూడు స్థానాల విషయంలో మాత్రం సర్దుకు పోలేకపోతున్నది.  ఆ మూడు స్థానాలూ అరకు, అనపర్తి, నరసాపురం. ఆ మూడు స్థానాలనూ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ఒక కులం రంగుపులమడానికి వైసీపీ చేసిన ప్రచారం ఎంతటి అవాస్తవమో తేటతెల్లమైంది. ఒక వైపు వైసీపీలో రెడ్డి సామాజకి వర్గానికి ఉన్న ప్రాధాన్యత మరే సామాజిక వర్గానికీ లేదని  అధికారుల నియామకం నుంచి పార్టీ టికెట్ల కేటాయింపు వరకూ ప్రతి విషయంలోనూ రుజువు అవుతున్నది. అదే తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి అన్ని సమాజిక వర్గాలకూ సమప్రాధాన్యత కనిపిస్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్న మూడు స్థానాలలోనూ కూడా తెలుగుదేశంకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలలో తెలుగుదేశం టికెట్ దక్కక నిరాశ చెందిన అభ్యర్థులెవరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కారు. 

ఆరకు ఎస్టీ రిజర్వుడు స్థానం. ఆ స్థానంలో గత మూడున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన దన్నుదొర పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సిరావడాన్ని క్యాడర్ అంగీకరించలేకపోతున్నది. పార్టీ కోసం నిలబడిన దొన్నుదొరకే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

ఇక అనపర్తి విషయానికి వస్తే ఇక్కడ  పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని సమర్ధించడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమ మద్దతు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే అని స్పష్టం చేస్తోంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేస్తోంది. ఇందుకు కారణం గత ఐదేళ్లుగా నల్లమిల్లి పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు.  ఇక నరసాపురంలో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రఘు రామకృష్ణంరాజు కు తెలుగుదేశం క్యాడర్ మద్దతుగా నిలబడింది.  జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై   అలుపెరగని పోరాటం చేసిన రఘురామకృష్ణం రాజుకు అన్యాయం జరగడానికి వీల్లేదని పట్టుబడుతోంది. ఈ మూడు సీట్ల విషయంలో తెలుగుదేశం క్యాడర్ గట్టిగా నిలబడింది. వీరి విషయంలో పునరాలోచించాలని అధిష్ఠానాన్ని కోరుతోంది.  

పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన వారిలో దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్‌, ఆలపాటి రాజా తదితర కమ్మ నేతలూ ఉన్నారు. క్యాడర్ వారి పట్ల సానుభూతి చూపుతున్నది, అయితే  అరకు, అనపర్తి, నరసాపురం సీట్ల విషయంలో మాత్రం పోరాడుతోంది.  ఈ ఉదాహరణ చాలు తెలుగుదేశం పార్టీకి కులం రంగు పులమడానికి అవకాశం లేదని చెప్పడానికి.   పార్టీపై కులం ముద్ర వేయడానికి గత పదేళ్లుగా (విపక్షంలో ఉన్న ఐదేళ్లు, అధికార పార్టీగా ఐదేళ్లు) వైసీపీ చేసిన దుష్టపన్నాగాలు, ప్రయత్నాలూ ఫలించలేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి. 

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.