పవన్ హామీ అమలుకు జగన్ సై!.. భ‌య‌మే కార‌ణ‌మా?

Publish Date:Apr 13, 2022

Advertisement

మాట తప్పం.. మడమ తిప్పమని హోరెత్తించే వైయస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి మాట తప్పింది.. మడమ తిప్పింది. ఇంటి వద్దకే రేషన్ అంటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకానికి ఈ జగన్ ప్రభుత్వం మంగళం పాడి.. హరతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా.. రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు... ఆవి వద్దనుకుంటే.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇవ్వనుంది. మే నుంచి ఈ నగదు బదిలీ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర పౌరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

అందుకు అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులు .. ప్రతి నెల నగదు పంపిణి చేస్తారు. ఈ ప్రయోగాన్ని తొలుత అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతోపాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కిలో బియ్యానికి 12 నుంచి 15 రూపాయిలు రేషన్ కార్డుదారుడికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.  ఇలా రెండు నెలలు తీసుకున్న తర్వాత.. నగదు వద్దు.. బియ్యం కావాలంటే తీసుకోవచ్చునని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. 

అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇదే తరహాలో తన మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ప్రకటించారు. ఆయన కూడా... రేషన్ సరుకులకు బదులు కొంత నగదు.. రేషన్ కార్డుదారుడి ఖాతాలో వేస్తామని ఆయన క్లియర్ కట్‌గా వెల్లడించారు. తాజాగా జగన్ ప్రభుత్వం... గతంలో పవన్ చెప్పినట్లు చేస్తూ.. జనసేనాని బాటలో నడుస్తున్నారని గాజు గ్లాస్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. 

మరోవైపు వైయస్ జగన్ అధికారంలోకి రావడంతోనే.. ఇళ్ల వద్దకే రేషన్ అంటూ భారీగా వ్యాన్లను కోట్లాది రూపాయిల ప్రజాధనంతో కొనుగోలు చేశారు. సదరు వాహనాల రవాణ కొసం డిజీల్, వాహనాలకు డ్రైవర్లు.. ఇలా పలువురు సిబ్బంది అవసరమవుతున్నారు. ఈ సిబ్బందికి జీతాలు, వాహనాల్లో అయిల్... ఇలా ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో పవన్ చెప్పినట్లు.. రేషన్ కార్డు హోల్డర్ల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. ప్రభుత్వానికి చాలా భారం తప్పుతోందని ఈ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరి కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కొనుగోలు చేసిన.. వేలాది వాహనాల పరిస్థితి ఏమిటనే చర్చ.. అప్పుడే ప్రజల్లో మొదలైందీ. అలాగే అందుకోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుందనే విమర్శలు అప్పుడే  మొదలైనాయి. మరోవైపు.. మరిన్ని పథకాలకు మంగళం పాడేందుకు ఈ జగన్ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని.. అందుకోసం ఇప్పటికే కొన్ని పథకాలు.. లబ్దిదారులకు అందడం లేదని సమాచారం. ఏదో ఒక మెలిక పెట్టి.. నవరత్నాలను లబ్ధిదారులకు కట్ చేయడం కోసం.. ఈ జగన్ ప్రభుత్వం  ఎంత చేయాలో అంత చేస్తుందని... విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
 

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.