మీ పిల్లలు ఫోన్‌ చూస్తూ నిద్రపోతున్నారా!

Publish Date:May 15, 2018

Advertisement

ఒకప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చేందుకు కథలో కబుర్లో చెబితే సరిపోయేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కథలు చెప్పే ఓపిక పెద్దలకీ లేదు, కబుర్లు వినే ఉత్సాహం పిల్లవారికీ లేదు. ఇప్పుడంతా డిజిటల్‌మయం. కాసేపు ఫోనో, టీవీనో, టాబ్లెట్టో చూసీచూసీ అలసి నిద్రలోకి జారుకుంటున్నారు పిల్లలు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు కానీ ఎంత హానికకరం అన్నదాని మీద ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

20 పరిశోధనల సారం

లండన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పిల్లల ఆరోగ్యం, అలవాట్ల మీద జరిగిన దాదాపు 20 పరిశోధనలను క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా 14 ఏళ్ల సగటు వయసున్న లక్షాపాతికవేల మంది పిల్లల సమాచారాన్ని గమనించారు. ఈ పరిశీలనలో పిల్లల మీద డిజటల్‌ మాధ్యమాల ప్రభావం గురించి అనేక విషయాలు వెల్లడయ్యాయి.

మంచం దగ్గరే

72 శాతం మంది పిల్లలు తమ మంచం దగ్గరే ఏదో ఒక డిజిటల్‌ పరికరాన్ని ఉంచుకుని నిద్రపోతున్నట్లు తేలింది. వీరిలో నిద్రపోయేందుకు ఒక 90 నిమిషాల ముందువరకు ఫోన్‌ చూస్తూ గడిపిన పిల్లల్లో 79 శాతం మంది నిద్రలేమితో బాధపడటాన్ని గమనించారు. ఒకవేళ నిద్రపట్టినా కూడా 46 శాతం మంది పిల్లలు కలతనిద్రలోనే గడపాల్సి వచ్చింది. ఇలా సరైన నిద్ర లేకపోవడంతో, వీరంతా ఉదయం వేళల్లో మత్తుతో తూగిపోవడం మొదలుపెట్టారట.

నిద్రే కాదు

పిల్లల ఎదుగుదలలో నిద్ర ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి నిద్రే కనుక దూరమైతే వారు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఉద్రేకంగా ప్రవర్తించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఊబకాయం, ఎదుగుదల సమస్యలు, మానసికమైన లోపాలు... వంటి సమస్యలన్నీ కూడా ఆ పిల్లవాడిని చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

కారణం ఇదీ!

ఫోన్, టాబ్లెట్‌, టీవీ వంటి పరికరాల నుంచి వచ్చే వెలుతురు మన శరీరంలోని మెలటోనిన్‌ అనే హార్మోనుని ప్రభావితం చేస్తుందట. మనలోని జీవగడియారాన్ని నియంత్రించే ఈ హార్మోనుని అడ్డుకోవడం వల్ల శరీరానికి నిద్రపోవాలన్న సూచన అందదు. చివరికి అది నిద్రలేమి అనే ఓ విషవలయానికి దారితీస్తుంది. ఇక డిజిటల్‌ పరికరాలతో ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో మునిగిపోవడం, గేమ్స్ ఆడటం, చాటింగ్‌ చేయడం వంటి చర్యల వల్ల పిల్లలోని ఉద్విగ్న స్థాయి పెరిగిపోతుంది. దాని వల్ల కూడా నిద్ర కరువవుతుంది. అంతేకాదు! ఒకవేళ ఫోన్ పక్కన పెట్టేసినా కూడా, మనసు దాని చుట్టూనే తిరిగే అవకాశం ఉందంటున్నారు. వాట్సప్‌లో ఎవరన్నా మెసేజ్‌ పంపి ఉంటారా! ఫేస్‌బుక్‌లో నేను పెట్టిన పోస్టుకి కామెంట్స్‌ ఏవన్నా వచ్చి ఉంటాయా! వంటి సవాలక్ష సందేహాలతో పిల్లల మెదడు మేలుకొనే ఉంటుంది. కాబట్టి రాత్రివేళల్లో పిల్లలు ఫోన్ల వ్యాపకానికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే. బహుశా అదేమంత కష్టమైన పని కాదేమో! ముందు పెద్దవారు తమ చేతిలో ఉన్న ఫోన్లను పక్కన పెట్టి కాస్త పిల్లలతో మాట్లాడటం మొదలుపెటడితే... పరిస్థితులు సగం దారికి వస్తాయి.

 

 

- నిర్జర

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.