సిట్టింగుల్లో 60% గోడ దూకేశారు...

Publish Date:Jan 23, 2022

Advertisement

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్,నాలుగు వందల పైచిలుకు (403) అసెంబ్లీ స్థానాలు, 80 లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రం. మరో వంక గోవా చాలా చిన్న రాష్ట్రం. యూపీ అసెంబ్లీ స్థానాల్లో జస్ట్ ఓ పది శాతం 40 అసెంబ్లీ స్థానాలు, రెండే రెండు (నార్త్ గోవా, సౌత్ గోవా) లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం గోవా. అయినా, యూపీలో  ఎన్నికల రాజకీయాలు ఎంత రంజుగా సాగుతున్నాయో గోవా రాజకీయాలు కూడా అంతే రంజుగా సాగుతున్నాయి. 

ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో యూపీతో, గోవా పోటీ పడుతోందా, అనే విధంగా గోవాలో ఫిరాయింపులు జరుగుతున్నాయి. గడచిన ఐదేళ్ళలో మారీ ముఖ్యంగా గడచిన నెల రెండు నెలల్లో 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్’లో 34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అందులో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సహా  24  మంది సమాజవాదీ పార్టీ తీర్థం పుచ్చుకుంటే, బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎనిమిది మందిని తమ వైపుకు తిప్పుకుంది. నాలుగొందల మంది ఎమ్మెల్యేలలోంచి ఐదేళ్లలో  34 మంది ఎమ్మెల్యేలు గోడ దూకడం మచ్చే అయినాఓకే అనుకోవచ్చును. కానీ, గోవాలో మొత్తం ఉన్నదే 40 మంది ఎమ్మెల్యేలే అయినా అందులో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అంటే ఐదేళ్లలో 60 శాతం మందికి పైగా పార్టీ ఫిరాయించారు. ఇది భారత ప్రజా స్వామ్య చరిత్రలో, ఒక రికార్డు. ‘న ‘బూతో’ న భవిష్యతి’. 

ఈ ఫిరాయింపుల పుణ్యానే 2017 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారు. మరోవంక కేవలం 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ, ఫిరాయింపుల రూటులో అధికారంలోకి వచ్చింది. సభలో సంఖ్యా బలాన్ని 13నుంచి 27కు పెంచుకుంది. అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత మైఖేల్ లోబో సహా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వదిలి పోయారు. మరో వంక తాజాగా గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ పర్సేకర్, పార్టీకి రాజీనామా చేశారు.. గత ఎన్నికలో ఒడి పోయిన ఆయనకు ఈ సారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. గత ఎన్నికకలో ఆయన్ని ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరి టికెట్ పట్టుకు పోయారు. దాంతో మాజీ ముఖ్యమంత్రి బీజేపీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్’గా బరిలో దిగుతున్నారు. ఇంతకు ముందే మరో మాజీ ముఖ్యమంత్రి పారేకర్ కుమారుడు ఉత్పల్ పారేకర్ కూడా, పార్టీ టికెట్  నిరాకరించింది. ఆయన కూడా పార్టీకి రాజీనామాచేసి ఫ్యామిలీ అడ్డా పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

అదలా ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. చివరకు, 15 మంది ఏమ్మేలు పార్టీ ఫిరాయించారు. ఈ  నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇంతవరకు ప్రకటించిన 34 మంది పార్టీ అభ్యర్ధులను గుడి, చర్చి,మసీదుకు తీసుకు పోయి, “ ..... అనే నేను ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్టీ ఫిరాయించనని, పార్టీ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని .. దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రమాణం చేయించారుట. అయితే, దొంగకు మడి బట్ట అడ్డమా ...అన్నట్లు పార్టీ ఫిరాయించాలనుకునే వారికి ఈ ప్రతిజ్ఞలు , ప్రమాణాలు అడ్డు వస్తాయా .. ఏంటో .. ఎవరి పిచ్చి వారికి ఆనందం.
 

By
en-us Political News

  
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి.
మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు.
ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.