దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తేశాడు. దేశంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా వివిధ ప్రయత్నాలు చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు స్వయంగా తానే ఓ రాజకీయ పార్టీని స్థాపించేశారు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, ఏపీలో జగన్ కు, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించారు, అందిస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ కు కూడా ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ముందుకు వచ్చారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం దాదాఫు ఖరారేనని కూడా అంతా భావించారు. చివరకు సోనియా ఆహ్వానించినా కూడా కాంగ్రెస్ లో చేరడానికి నిరాకరించారు.
తొలుత ఆయన తన స్వంత రాష్ట్రం బీహార్ లో జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలు ఉన్నాయన్నది జగద్వితితం. అయితే ఆ తరువాత నితీష్ ఎన్డీయే పంచన చేరడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చేసి, తనకు అచ్చొచ్చిన ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి అధికారం అందకుండా చేయాలంటే దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ప్రతిపాదనతో బీజేపీయేతర పార్టీలన్నిటితో మంతనాలు జరిపారు. మూడో ఫ్రంటూ, నాలుగో ఫ్రంట్ లతో లాభం లేదనీ, కాంగ్రెస్ సహా బీజేపీయేతర శక్తులన్నీ కలిస్తేనే జాతీయ స్థాయిలో కమల నాథులకు కాషాయం రుచి చూపించే అవకాశం ఉంటుందనీ, అందుకే రెండో ఫ్రంటే సరైనా మార్గమనీ వాదించిన పీకే చివరికి ఎవరూ కలిసి రాక సొంత కుంపటి వైపు మొగ్గు చూపారు.
సొంత పార్టీతోనైనా బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టి రెండు సాధిస్తారా? అలా సాధించేందుకు పీకేతో కలిసి వచ్చే పార్టీ లేమిటి? మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రేలు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే బీహార్ నుంచి ఆర్జేడీ కూడా పీకే ప్రతిపాదించే రెండో ఫ్రంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఒకింత అగమ్య గోచరంగానే ఉంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీలకు పీకేయే ఎన్నికల వ్యూహకర్త. మరి ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు పీకే కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అంగీకరింప చేయగలుగుతారా? ఒక వేళ అది సాధ్యం కాకపోతే..వాటికి ఎన్నికల వ్యూహాలను అందించడం మానేస్తారా? ముఖ్యంగా తెలంగాణలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. బీజేపీ బీ టీమ్ గా ముద్ర పడ్డ తెరాస పీకే వ్యూహాల కోసం కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందా? ఆ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మొత్తం మీద పీకే రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో చూడాల్సి ఉంది. ఇంత కాలం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన పీకే.. సొంత పార్టీ కోసం ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో చూడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/can-pk-own-party-unite-non-bjp-parties-39-135334.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.