మూడూ, నాలుగూ లాభంలేదన్న పీకే సొంత పార్టీతో రెండు సాధిస్తారా?

Publish Date:May 2, 2022

Advertisement

దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తేశాడు. దేశంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా వివిధ ప్రయత్నాలు చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు స్వయంగా తానే ఓ రాజకీయ పార్టీని స్థాపించేశారు.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, ఏపీలో జగన్ కు, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించారు, అందిస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ కు కూడా ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ముందుకు వచ్చారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం దాదాఫు ఖరారేనని కూడా అంతా భావించారు. చివరకు సోనియా ఆహ్వానించినా కూడా కాంగ్రెస్ లో చేరడానికి నిరాకరించారు. 

తొలుత ఆయన తన స్వంత రాష్ట్రం బీహార్ లో జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలు ఉన్నాయన్నది జగద్వితితం. అయితే ఆ తరువాత  నితీష్ ఎన్డీయే పంచన చేరడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చేసి, తనకు అచ్చొచ్చిన ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి అధికారం అందకుండా చేయాలంటే దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ప్రతిపాదనతో బీజేపీయేతర పార్టీలన్నిటితో మంతనాలు జరిపారు.  మూడో ఫ్రంటూ, నాలుగో ఫ్రంట్ లతో లాభం లేదనీ, కాంగ్రెస్ సహా బీజేపీయేతర శక్తులన్నీ కలిస్తేనే జాతీయ స్థాయిలో కమల నాథులకు కాషాయం రుచి చూపించే అవకాశం ఉంటుందనీ, అందుకే రెండో ఫ్రంటే సరైనా మార్గమనీ వాదించిన పీకే చివరికి ఎవరూ కలిసి రాక సొంత కుంపటి వైపు మొగ్గు చూపారు. 

సొంత పార్టీతోనైనా బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టి రెండు సాధిస్తారా?  అలా సాధించేందుకు పీకేతో కలిసి వచ్చే పార్టీ లేమిటి? మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రేలు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే బీహార్ నుంచి ఆర్జేడీ కూడా పీకే ప్రతిపాదించే రెండో ఫ్రంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఒకింత అగమ్య గోచరంగానే ఉంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీలకు పీకేయే ఎన్నికల వ్యూహకర్త. మరి ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు పీకే కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అంగీకరింప చేయగలుగుతారా? ఒక వేళ అది సాధ్యం కాకపోతే..వాటికి ఎన్నికల వ్యూహాలను అందించడం మానేస్తారా? ముఖ్యంగా తెలంగాణలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. బీజేపీ బీ టీమ్ గా ముద్ర పడ్డ తెరాస పీకే వ్యూహాల కోసం కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందా? ఆ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మొత్తం మీద పీకే రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో చూడాల్సి ఉంది. ఇంత కాలం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన పీకే.. సొంత పార్టీ కోసం ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.