డైవర్షన్ కే విస్తరణ.. ముందస్తుకే జగన్ మొగ్గు?

Publish Date:Mar 31, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోటితో చెప్పేదొకటి.. చేతల్లో చేసేదొకటి. గత నాలుగేళ్లుగా ఆయన పాలన సాగిస్తున్న విధం ఇదే. ఇప్పుడు తాజాగా పార్టీ సర్కిల్స్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడ ఇహనో ఆయన కేబినెట్ రీషఫుల్ చేస్తారనీ, కొత్తగా నలుగురైదుగురికి కేబినెట్ లోకి తీసుకుంటారనీ పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అదే సమయంలో కొందరికి ఉద్వాసన తప్పదనీ అంటున్నారు.

సరే ఇన్ ఎవరు.. ఔట్ ఎవరు అన్న చర్చను పక్కన పెడితే.. మంత్రివర్గ విస్తరణ అనేది ఒక వ్యూహం మాత్రమేననీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఆయన పావులు కదుపుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తో ముందస్తు ముచ్చటకు జగన్ చెల్లుచీటీ పాడేశారన్న భావన విపక్షాలలో కలిగించడమే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయిన తరుణంలో ఆయన వైనాట్ ఎర్లీ ఎలక్షన్స్ అన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. వివేకా హత్య కేసు విషయం అలా ఉంచితే.. కేవలం పక్షం రోజుల వ్యవథిలో ఆయన రెండు సార్లు హస్తినకు వెళ్లి చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించిన రాచకార్యం ముందస్తే అని పరిశీలకులు అంటున్నారు. అందుకోసమే ఆయన తాజా ఢిల్లీ పర్యటనలో హడావుడిగా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారనీ, అర్ధరాత్రి ఆయన నివాసానికి వెళ్లి మరీ సుదీర్ఘ భేటీ జరిపారనీ అంటున్నారు.  

ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితిని జగన్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు వివరించడమే కాకుండా, విపక్షాలు ప్రమత్తంగ ఉన్న సమయంలోనే ముందస్తుకు వెళితే ఏదో మేరకు అధికారపార్టీకి లాభం ఉంటుందని వివరించారని అంటున్నారు. అందుకోసం.. ఈ డిసెంబర్ లోనే అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీకి ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర విషయాలలో కాన్ సన్ ట్రేట్ చేసే అవకాశం ఉండదని జగన్ అమిత్ షాకు వివరించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. అసలు తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న తన అభిమతాన్ని కేంద్రానికి చెప్పి అనుమతి, అంగీకారం తీసుకునేందుకే స్వల్ప వ్యవధిలో రెండు సార్లు జగన్ హస్తినకేగి వచ్చారని విశ్లేషిస్తున్నారు.  

జగన్ ముందస్తు నిర్ణయానికి రావడానికి కారణం ఇటీవల ఆయన స్వయంగా చేయించుకున్న సర్వే ప్రకారం ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ బొటాబొటిగా, అంటే అత్తెసరు మెజారిటీలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని తేలిందనీ, అదే నిర్దిష్ట గడువు వరకూ ఆగితే.. ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగి.. మొదటికే మోసం వస్తుందన్న సర్వే ఫలితం కారణంగానే ముందస్తు అడుగుల జోరు పెంచారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే  ఆరు నెలల అధికారాన్ని వదులుకుని మరీ ముందస్తుకు జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అన్నిటికీ మించి ముందస్తుకు తొందరపడకపోతే.. ఏపీలో 2014 నాటి సీన్ పునరావృతమౌతుందన్న భయం జగన్ లో గూడుకట్టుకుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంటే తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఏపీలో బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నది జగన్ భావనగా చెబుతున్నారు. అంటే తెలంగాణలో సపోజ్.. ఫర్ సపోజ్ హంగ్ వస్తే ( తెలంగాణలో హంగ్ కే ఎక్కువ అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి) అప్పుడు బీజేపీ అధికారం కోసం తెలుగుదేశం మద్దతు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఏపీలో బీజేపీ మద్దతు కోసం తెలంగాణలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇసుమంతైనా వెనుకాడదని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నాయి.

ఆ విషయంలో బీజేపీకి సంకేతం ఇవ్వడానికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వంద స్థానాలలో పోటీకి తెలుగుదేశం ఇప్పటికే రెడీగా ఉందని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే జగన్ ముందస్తుకు తొందరపడుతున్నారనీ, ఏలాగైనా సరే కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించేందుకే వరుస హస్తిన పర్యటనలనీ అంటున్నారు.  

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.