హైదరాబాదుపై క్యాబినెట్ చర్చ, నిర్ణయం?

Publish Date:Oct 1, 2013

Advertisement

మొన్న హైదరాబాదులో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తనతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి ‘టచ్చు’లోనే ఉందని అక్టోబరు ఆరులోగా అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయబోతున్నదని ప్రకటించారు. ప్లగ్గు పీకడం సంగతి ఎలా ఉన్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో బాటు బీజేపీ అధిష్టానంతో కూడా పూర్తి టచ్చులోనే ఉన్నట్లు సమాచారం.

 

రాష్ట్ర విభజన సజావుగా జరగాలంటే హైదరాబాదుపై కొంత పట్టువిడుపులు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విభజనకు అంగీకరిస్తేనే హైదరాబాదుపై సీమాంద్రా నేతల డిమాండ్లను కొన్నిటినయినా నేరవేర్చగలమని వారికి నచ్చచెపుతున్నట్లు తెలుస్తోంది.

 

ఈ విషయంలో బీజేపీ అధిష్టానాన్నికూడా సంప్రదిస్తూ దానిపై వారి సలహా, సూచనలు తీసుకొంటునట్లు తెలుస్తోంది. తద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ఆలోచన. కొద్ది రోజుల క్రితం వరకు ‘సమన్యాయం’ అని మాట్లాడిన బీజేపీ అందుకే తన వైఖరి మార్చుకొని ఉంటుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మెహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చును.

 

రేపు జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టబోయే టీ-బిల్లులో ఈ ప్రతిపాదనలు ఉండవచ్చునని తాజా సమాచారం.

1. గ్రేటర్ హైదరాబాదు మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది.

 

2. విద్య, వైద్యం, ఉద్యోగాలు, లా అండ్ ఆర్డర్, భూశిస్తు, మరియు ఇతర ఆదాయ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.

 

3. ప్రస్తుతం హైదరాబద్, సైబరాబాద్ రెండు పోలీస్ కమీషనరేట్లను గ్రేటర్ హైదరాబాదు పరిధిలోకి తీసుకు వస్తారు.

 

4. ముందు ప్రకటించినట్లుగానే హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగంగా, తెలంగాణా రాజధానిగా ఉంటుంది. అదే సమయంలో మరో పది సంవత్సరాల వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

 

ఈ ప్రతిపాదనలకు సీమాంధ్ర, టీ-నేతలు అంగీకరించినట్లయితే వెంటనే విభజన ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజదానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సీమంద్రా నేతలతో సంప్రదింపులు మొదలవుతాయి.

By
en-us Political News

  
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.