Publish Date:Jun 24, 2022
కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ సర్కార్ నిర్ణయం తీసేసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అయితే ఈ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వినతుల నేపథ్యంలో పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది.
దీనిని వ్యతిరేకిస్తూ.. కోనసీమ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమలాపురంలో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. గత నెల 24న అమలాపురం పట్టణంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలను ఆందోళనకారులు ధగ్ధం చేశారు. పోలీసు వాహనాలు సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అమలాపురం పట్టణంలో ఆంక్షలు విధించారు. పక్షం రోజుల పాటు అంతర్జాల సర్వీసులను నిలిపివేశారు. ఈ అల్లర్ల వెనుక విపక్షాల హస్తం ఉందంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది.
అయితే వాస్తవానికి అల్లర్ల కుట్ర అధికార పార్టీదేనంటూ విపక్షాలు ఫొటోలతో సహా వివరాలను బయటపెట్టారు. దీంతో సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడంతో కుట్ర పూరితంగా విధ్వంసం సృష్టించింది వైసీపీయేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా పేరు మార్పునకు అభ్యంతరాలు తెలియజేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో పేరు మార్పుపై చర్చింది..
కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదలా ఉండగా, కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పైన కోర్టు విచారించాల్సి ఉంది. మొత్తం మీద కోనసీమలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-approves-name-chane-of-konaseema-district-39-138379.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది