ఆదిమూలం రాజీనామా? సత్యవేడుకు ఉప ఎన్నిక?
Publish Date:Sep 6, 2024
Advertisement
తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదు అయింది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటిఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తనవెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరుగానీ, తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం వుంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంతగూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా వుంచితే, ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జె.డి.రాజశేఖర్కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి వుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టిక్కెట్ ఆదిమూలానికే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జె.డి.రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్కే టిక్కెట్ దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా వుండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద వున్న ‘11’ ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం వుంది.
http://www.teluguone.com/news/content/by-elections-to-satyavedu-39-184407.html