వలసలు కాదు ఉప ఎన్నికలే అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటన్నది కుండ బద్దలు కొట్టేశారు. మునుగోడుతో సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ఆగిపోదనీ, కనీసం మరో మూడు నాలుగు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కమలం గూటికి చేరడం ఖాయమని ఆయన చెప్పేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీలైనన్ని నియోజవకర్గాలలో ఉప ఎన్నికలు జరిగేలా కమలంపార్టీలోనికి వలసలు ఉంటాయనీ బండి సంజయ్ చెప్పారు. కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి వలసల ప్రవాహం ఆరంభమైనట్లేననీ, ఆలా ఆయా పార్టీల నుంచి వచ్చి కమలం గూటికి చేరే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా తప్పని సరిగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఇదంతా టీఆర్ఎస్ ను కుదేలు చేయడానికి లేదా గాభరా పెట్టడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది పైన రెండు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో ఇలా వరుస ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి రావడం ఏ విధంగా చూసినా అధికార పార్టీకి లాయకీ కాదు. అందుకు టీఆర్ఎస్ ఏమీ మినహాయింపు కాదు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాలుగైదు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండంటూ టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతున్నారు. ఒక వేళ బండి సంజయ్ అన్నట్లు కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే వస్తే కేసీఆర్ ముందస్తుపై తీవ్రంగా ఆలోచించక తప్పని సరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. బండి వ్యూహం కూడా అదేనని అంటున్నారు. కేసీఆర్ సాధారణంగా షెడ్యూల్ వరకూ ఆగకుండా ముందస్తుకే మొగ్గు చూపుతారు.
2014 ఎన్నికలలో విజయం తరువాత ఆయన ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లి ఘన విజయాన్ని అందుకున్నారు. అదే ఫార్ములాను అనుసరించి ఈ సారి కూడా ముందస్తు యోచన చేసినా కేంద్రంలో బీజేపీతో సంబంధాలు చెడిన నేపథ్యంలో ముందస్తు కోసం అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం చక్రం తిప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ఎదురెత్తు వేస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. అయితే సిట్టింగ్ ల వరుస రాజీనామాలతో ఎక్కువ సంఖ్యలో ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి వస్తే మాత్రం కేసీఆర్ అనివార్యంగా ముందస్తు యోచనను ముందుకు తీసుకువస్తారన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది.
అందుకే బండి సంజయ్ పదే పదే పలు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అంటూ ఫీలర్లు వదులుతున్నారు. అయితే ఇప్పటి వరకూ కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వినా మరెవరూ కమలం గూటికి చేరబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించింది లేదు. వ్యూహాత్మకంగా పలువురు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఫీలర్లు వదులుతోంది. ఏది ఏమైనా రాజగోపాల రెడ్డి రాజీనామా చేసేశారు. అదే బాటలో మరి కొంత మంది నడిస్తే మాత్రం కేసీఆర్ ముందస్తు యోచనతో ముందుకు సాగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/by-elections-or-early-elections-bjp-mind-game-on-kcr-39-141234.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.