Publish Date:Aug 10, 2022
అధికారం ఎంత పనైనా చేయిస్తుంది. అందుకు ప్రధాని మోడీ అయినా, మంత్రి గడ్కరీ అయినా మినహాయింపు కాదనడానికి తాజాగా గడ్కరీ చేసిన వ్యాఖ్యే నిదర్శనం. అధికారులకు ఉద్యోగ నిబంధనలు బుక్ రూల్ అలాంటివన్నీ ఉన్నా మంత్రులు చెప్పిన దానికి ఎస్ బాస్ అని తీరాల్సిందేనని గడ్కరీ తేల్చేశారు.
విధినిర్వహణలో ఎలా వ్యవహరించాలన్నదానికి అధికారులకు బోలెడు నిబంధనలున్నాయి. వాటిని కాదని మంత్రో, ముఖ్యమంత్రో చెప్పారనీ రూల్స్ ను ఉల్లంఘిస్తే.. మంత్రులకూ ముఖ్యమంత్రులకూ ఏం కాదు. కానీ అధికారులు మాత్రం కోర్టు అక్షింతలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఉల్లంఘన ఇంకొంచెం తీవ్రమైనదైతే ఉద్యోగానికే ఎసరు రావచ్చు.. కొండొకచో జైలుకూ వెళ్లాల్సి రావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైస్ హయాంలో జరిగిందదే. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరుగుతున్నదీ అదే. ప్రభుత్వం చెప్పిన దానికల్లా సరేనంటూ తలలూపేసిన కారణాన పలువురు ఐఎస్ఎస్ అధికారులు కోర్టులలో అక్షింతలు వేయించుకున్నారు.
మొట్టికాయలు భరించారు. సామాజిక సేవా శిక్షను సైతం అనుభవించారు. అయినా సరే వ్యవస్థలలో మంత్రులదే అంతిమ నిర్ణయం అంటున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. మంత్రులు ఏం చెప్పినా.. ఎస్ బాస్ సఅంటూ చేయడమే బ్యూరోక్రాట్ల పని అని తేల్చేశారు. ప్రభుత్వం పని చేసేదే మంత్రుల భాగస్వామ్యంతో అని వారికి హితవు చెప్పారు.
(బ్యూరోక్రాట్లు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు బ్యూరోకాట్లు ‘యస్ సర్’ అని అనాల్సిందే. అని విస్పష్టంగా చెప్పేశారు. ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ప్రస్తావిస్తూ, అవసరమైతే చట్టాన్ని పది సార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదని గడ్కరీ స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/burocrats-should-say-yes-boss-to-ministers-directions-says-gadkari-39-141651.html
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.
Publish Date:Aug 31, 2026
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.