Publish Date:Mar 30, 2025
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.
Publish Date:Mar 29, 2025
విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది.
Publish Date:Mar 29, 2025
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట.
Publish Date:Mar 29, 2025
కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్. ఆస్పత్రులు దేవాలయాలు, డాక్టర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది.
Publish Date:Mar 29, 2025
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Publish Date:Mar 29, 2025
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు.
Publish Date:Mar 29, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది.
Publish Date:Mar 29, 2025
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు
అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది.
Publish Date:Mar 29, 2025
గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు.
Publish Date:Mar 29, 2025
యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్ అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Mar 29, 2025
మణిపూర్ లో భూమి కంపించింది.శనివారం (మార్చి 29) మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Publish Date:Mar 29, 2025
Publish Date:Mar 29, 2025
ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరి వారంలో నాటికే మునుపెన్నడూ లేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎపిలోని 150 మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి