Publish Date:Jul 14, 2022
దేశంలో భక్తి పారవశ్యానికి తక్కువేమీలేదు. ప్రతీదీ మతం, భక్తితో ముడిపెట్టేయడం అనాదిగా దేశంలో వస్తున్నదే. పిల్లాడికి బాగోలేకపోయినా, పిల్లదానికి పెళ్లికాబోయినా, కాలేజీ సీటు, విదేశాలకు వీసా రాక పోయినా కూడా దేవుడిమీదే భారం వేయడం బాగా అలవాటయిపోయింది. అందుకే దేశంలో బాబాల హడావుడి ఎక్కువైపోయింది. అయితే ఈ బుల్లెట్ బాబా సంగతి వేరు. దేశంలోని అనేక దేవాలయాల్లో ఈ బులెట్ బాబా గుడి ఒకటి. ఇది రాజస్థాన్ జోధ్పూర్లో వుంది. దీని చుట్టూ కూడా భక్తగణం తెగ తిరుగు తూంటారు.
ఇంతకీ బులెట్ బాబా గుడి అనగానే అక్కడ ఏ సాయిబాబా విగ్రహమో వుంటుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ అలాంటిదేమీ లేదు. చిత్రంగా ఒక 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ వుంది. దీన్ని పూజించడానికి జోధ్పూర్ జనాలే కాదు చాలా దూర ప్రాంతాల నుంచీ కూడా భక్తులు క్యూ కడుతున్నారు.
ఈ జోధ్పూర్ గుడిని చాలాకాలం నుంచి ఇక్కడివారంతా బులెట్ బాబా గుడి అనే పిలుస్తున్నారు. కానీ దీని అసలు పేరు ఓం బన్నా ధామ్. ఇంత చక్కటి పేరుండగా బులెట్ పేరు ఎందుకు పెట్టారని చాలామంది చాలారోజులు తెగ ఆలోచించారు. దీనికి ఒక ఆసక్తికర కథ వుంది. ఈ గుడి జోధ్పూర్ నుంచి 50 కి.మీ దూరంలోని పాలి పట్టణం సమీపంలోని చోటిలా గ్రామంలో వున్నది. 1988 డిసెంబర్ 2న ఓమ్ బన్నా అనే పెద్దాయన సందీరా సమీపంలోని బాంగ్దీ నుంచి ఈ గ్రామానికి బయలుదేరారు. ప్రయాణంలో ఆయన అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొంత దూరంలో గుండలో పడింది.
మర్నాడు ఉదయం పోలీసులు ఆ మోటార్సైకిల్ను దగ్గరున్న పోలీసు స్టేషన్కు తీసికెళ్లారు. చిత్రంగా మర్నాడు ఆ బండి స్టేషన్లోంచి మాయమైంది. పోలీసు స్టేషన్ నుంచి ఎవరు దొంగిలించారబ్బా అనుకు న్నారు పోలీసులు. తీరా చూస్తే సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన చోటనే మళ్లీ దొరికింది! పోలీసులకు, అక్కడి జనానికి ఆశ్చర్యమేసింది. ఇదెలా సాధ్యమని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. పోలీసులు మళ్లీ దాన్ని స్టేషన్కు తీసికెళ్లారు. అయితే ఈ సారి గొలుసులతో కట్టేసారు. చిత్రమేమంటే మర్నాడు ఉదయంచూస్తే మళ్లీ బండి గాయబ్! ఇలా మాయం కావడంతో ఆ బండికి బులెట్ బాబా అని పేరు వచ్చింది. అమాంతం దానికేదో మంత్రశక్తి వుందని ప్రజలు నమ్మేశారు. అంతే అనుకున్నదే తడవున అక్కడ గుడి నిర్మించారు. అదే బులెట్ బాబా గుడిగా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ జోధ్పూర్ వెళితే దర్శించండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bullet-baba-temple-25-139736.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.