Publish Date:Jul 14, 2022
దేశంలో భక్తి పారవశ్యానికి తక్కువేమీలేదు. ప్రతీదీ మతం, భక్తితో ముడిపెట్టేయడం అనాదిగా దేశంలో వస్తున్నదే. పిల్లాడికి బాగోలేకపోయినా, పిల్లదానికి పెళ్లికాబోయినా, కాలేజీ సీటు, విదేశాలకు వీసా రాక పోయినా కూడా దేవుడిమీదే భారం వేయడం బాగా అలవాటయిపోయింది. అందుకే దేశంలో బాబాల హడావుడి ఎక్కువైపోయింది. అయితే ఈ బుల్లెట్ బాబా సంగతి వేరు. దేశంలోని అనేక దేవాలయాల్లో ఈ బులెట్ బాబా గుడి ఒకటి. ఇది రాజస్థాన్ జోధ్పూర్లో వుంది. దీని చుట్టూ కూడా భక్తగణం తెగ తిరుగు తూంటారు.
ఇంతకీ బులెట్ బాబా గుడి అనగానే అక్కడ ఏ సాయిబాబా విగ్రహమో వుంటుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ అలాంటిదేమీ లేదు. చిత్రంగా ఒక 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ వుంది. దీన్ని పూజించడానికి జోధ్పూర్ జనాలే కాదు చాలా దూర ప్రాంతాల నుంచీ కూడా భక్తులు క్యూ కడుతున్నారు.
ఈ జోధ్పూర్ గుడిని చాలాకాలం నుంచి ఇక్కడివారంతా బులెట్ బాబా గుడి అనే పిలుస్తున్నారు. కానీ దీని అసలు పేరు ఓం బన్నా ధామ్. ఇంత చక్కటి పేరుండగా బులెట్ పేరు ఎందుకు పెట్టారని చాలామంది చాలారోజులు తెగ ఆలోచించారు. దీనికి ఒక ఆసక్తికర కథ వుంది. ఈ గుడి జోధ్పూర్ నుంచి 50 కి.మీ దూరంలోని పాలి పట్టణం సమీపంలోని చోటిలా గ్రామంలో వున్నది. 1988 డిసెంబర్ 2న ఓమ్ బన్నా అనే పెద్దాయన సందీరా సమీపంలోని బాంగ్దీ నుంచి ఈ గ్రామానికి బయలుదేరారు. ప్రయాణంలో ఆయన అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొంత దూరంలో గుండలో పడింది.
మర్నాడు ఉదయం పోలీసులు ఆ మోటార్సైకిల్ను దగ్గరున్న పోలీసు స్టేషన్కు తీసికెళ్లారు. చిత్రంగా మర్నాడు ఆ బండి స్టేషన్లోంచి మాయమైంది. పోలీసు స్టేషన్ నుంచి ఎవరు దొంగిలించారబ్బా అనుకు న్నారు పోలీసులు. తీరా చూస్తే సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన చోటనే మళ్లీ దొరికింది! పోలీసులకు, అక్కడి జనానికి ఆశ్చర్యమేసింది. ఇదెలా సాధ్యమని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. పోలీసులు మళ్లీ దాన్ని స్టేషన్కు తీసికెళ్లారు. అయితే ఈ సారి గొలుసులతో కట్టేసారు. చిత్రమేమంటే మర్నాడు ఉదయంచూస్తే మళ్లీ బండి గాయబ్! ఇలా మాయం కావడంతో ఆ బండికి బులెట్ బాబా అని పేరు వచ్చింది. అమాంతం దానికేదో మంత్రశక్తి వుందని ప్రజలు నమ్మేశారు. అంతే అనుకున్నదే తడవున అక్కడ గుడి నిర్మించారు. అదే బులెట్ బాబా గుడిగా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ జోధ్పూర్ వెళితే దర్శించండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bullet-baba-temple-25-139736.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.