శరణుజొచ్చినవాడికి అభయమిద్దాం!

Publish Date:Jun 18, 2022

Advertisement

సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు అంటాడు అన్నమయ్య తన కీర్తనలో. హరి అంటే విష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువును శరణు కోరితే, ప్రార్థిస్తే ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు అని అర్థం.

బుద్ధం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి

ధర్మం శరణం గచ్చామి అనేది అందరికీ తెలిసిన మాట.

బుద్ధుడికి లొంగిపోవడం, సంఘానికి లొంగిపోవడం, ధర్మానికి లొంగిపోవడం అనేవి అర్థాలు. బుద్ధుడు చెప్పిన విషయాలు అన్నీ సమాజాన్ని మార్చే శక్తివంతమైన వాక్యాలు. అహింసను పాటించడం, దుఃఖాన్ని జయించడం, కోర్కెలను జయించడం ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఇవన్నీ. కానీ ఇవి ఎలా సాధ్యం అంటే హింస లేనప్పుడు, స్వేచ్ఛగా బతకగలిగినపుడు. 

ఎక్కడైతే హింస చోటు చేసుకుంటుందో, అక్కడ మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. సమస్యలు చిన్నగా మొదలై స్వేచ్ఛ కోల్పోవడం దగ్గర నుండి చివరకి తిండి దొరడం కష్టమయ్యి, ప్రాణహాని సంభవించేవరకు దారితీస్తుంటాయి. అలాంటి వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఇంకొకరి సహాయం కోసం ఎదురుచూడటం లేదా ఎక్కడైనా కాసింత తిండి, ఉండటానికి షెల్డర్ దొరుకుతుందేమో అని ఉన్న ప్రాంతాన్ని వదిలి మరొకచోటుకు వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇలా కష్టసమయంలో ఒకచోటి నుండి మరొకచోటుకు సహాయం కోసం వలస వెళ్లే వాళ్ళను శరణార్థులు అంటారు. 

ఉద్యోగాల కోసం, బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం  నుండి మరొకప్రాంతనికి  వెళ్ళేవాళ్ళు వలసదారులు అయితే, సర్వం కోల్పోయి సహాయం కోరుతూ వెళ్లేవాళ్ళు శరణార్థులు అనబడతారు.

ప్రశ్నార్థక జీవితాలు!

తినడానికి తిండి, ఉండటానికి నివాసం, కాసింత ప్రాణ రక్షణ, కొద్దిగా స్వేచ్ఛ ఉంటే ఎవరూ ఉన్న ప్రాంతాలను వదిలి వెళ్లిపోరు. ముఖ్యంగా కొందరు కష్టపడి సంపాదించుకుని భూములు కొని, ఇళ్ళు కట్టుకుని, స్థిరస్థులను పొగుచేసుకుని ఎంతో చక్కగా ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయి పరిస్థితి రావచ్చు.

ముఖ్యంగా యుద్ధాలు జరిగే ప్రాంతాలలో, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు బాధిత ప్రాంతాలలో నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారిగా నిర్వాసితులు అయిపోతారు. అలాంటి వీళ్ళు సహాయం దొరుకుతుందనే ఆశతో వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రభుత్వాలు అలాంటి వాళ్ళను తరలించి ప్రభుత్వ సంరక్షణ హొమ్స్ లో కొద్దిరోజుల పాటు ఉంచుకుంటారు. కానీ జీవితంలో మళ్ళీ ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకు బండి నెట్టుకురావాలి. కానీ అలాంటి వాళ్లకు కొన్నిచోట్ల తగినంత ఆదరణ లభించదు. 

అపన్నహస్తం!

హిందువులు అయినా, ముస్లింలు అయినా ఇతర వర్గాల వాళ్ళు అయినా వాళ్ళ వాళ్ళ మతాలలో ఉన్న ముఖ్యసారం ఇతరులను ఆదుకోవడం, ఇతరులకు సహాయం చేయడం , ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం, జాలి, కరుణ వంటివి కలిగి ఉండటమే అనే ముఖ్య విషయం తెలుసుకోవాలి.

అలా తెలుసుకున్ననాడు ఇతరుల విషయంలో మానవత్వాన్ని కలిగి ఉంటాడు. నాకెందుకులే సమస్య నాది కాదు కదా అనే స్వార్థబుద్దిని ఎప్పుడూ ప్రదర్శించడు.

మన చుట్టూనే!

ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల సర్వం కోల్పోయి నిస్సహాయతతో బ్రతికిస్తూ ఉంటారు. గుడులు, రైల్వే స్టేషన్ లు, బస్టాండ్ లు, చుట్టూ ఉన్న ప్రాంతాలలో బయటకు అడగలేని వ్యక్తిత్వంతో కూడా ఉంటారు. మరికొందరు ఎక్కడినుంచో వలస వచ్చి కష్టాలు పడుతూ ఉంటారు. ప్రభుత్వాలు, స్వచ్చంధసంస్థలు చేసేవి ఎవరికీ పూర్తిగా భరోసాను ఇవ్వలేవు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి శరణార్ధుల విషయంలో బాధ్యతగా ఉండాలి. శరణుజొచ్చినవాడు శత్రువు అయినా వాడిని ఆదుకోవాలని చెబుతుంది మన భారతీయ సంస్కారపు సంస్కృతి. ఎన్నెన్నో దేశాల నుండి భారతదేశానికి శరణంటూ వచ్చి ఇక్కడే ఉన్న విదేశీయులు ఎందరో ఉన్నారు. పక్కదేశాలకు మన దేశం ఆవాసం కల్పించినప్పుడు మన పక్కవాడికి కష్టం వస్తే మనం తోచిన సహాయం చేయలేమా??

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు 20 మంది తమ స్వంత ప్రాంతాలను వదులుకుని ఇతర ప్రాంతాలకు సహయాలకోసం తరలివెళ్లిపోతున్నారు. వీళ్ళలో ఎక్కువ బాగం  చిన్నపిల్లలు, మహిళలే ఉంటున్నారు. ఇలాంటి  వాళ్ళను ఆదుకోవడం ప్రతిఒక్కరి బాద్యతనే కదా!!

                               ◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.