Publish Date:May 17, 2024
ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.
తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు బుద్ద వనాన్ని ఆసియాదేశాలకు పరిచయం చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు.
ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను వివరిస్తూ ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు.
స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ ) నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/buddhist-tourism-as--bridge-between-india-and-asia-countries-25-176226.html
ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు.
ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు.
వైసీపీ రౌడీ, గూండా బిడ్డల్లారా.. పోలింగ్ రోజున ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి వుండండి.. బయటకొచ్చి ఏదైనా అతి చేశారో... పోలీసులని చూశారుగా.. తుక్కుతుక్కు అయిపోతారు జాగ్రత్త!
తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ నాలుగో తేదీన తమ ఇళ్ళలో, తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో వున్నారు.
గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గిన ధరలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గడంతో అందుకు అనుగుణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.
ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ కేడర్ గత పదేళ్లుగా చెక్కుచెదరకుండా నిలబడినప్పటికీ, అనివార్యంగా తెలుగుదేశం ఆ రాష్ట్రంలో ఎన్నికల పోటీకి దూరంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో కానీ తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.
సాధారణ ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. శనివారం ( జూన్ 1) తుది విడత పోలింగ్ జరుగుతోంది. అంచనాలన్నీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి గట్టిగా పుంజుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అటువంటి తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు శనివారం (జూన్ 1) పసాయంత్రం 3 గంటలకు సమావేశమౌతున్నాయి.
లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కే సమయంలో కళ తప్పి, కాంతివిహీనం అయిపోయి వున్న ఆయన ముఖం ఇప్పుడు రంగు తేలింది. మిలమిలలాడుతోంది. ముఖ్యంగా బుగ్గలయితే బూరెల్లాగా పొంగాయి.
దేశంలో చివరి దైన ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్1) ప్రశాంతంగా సాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
Publish Date:May 31, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-3
Publish Date:May 31, 2024
అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.