Publish Date:Aug 12, 2026
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి. జగన్ కు పెట్టని కోట అయిన పులివెందులతో వైసీపీ నిరసనలకు జనం నుంచి స్పందన కరవైంది. అలాగే డీఎస్సీ అభ్యర్థులూ ఈ నిరసనలను పట్టించుకోలేదు. దీంతో జన సమీకరణ కోసం వైసీపీ స్థానిక నేతలు నానా తంటాలూ పడ్డారు. పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను బలవంతంగా నిరసన ర్యాలీలకు తరలించారు.
ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను రాజకీయ ఆందోళనల్లోకి లాగడంపై తెలుగుదేశం పార్టీ ఖండించింది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంపై మాట్లాడుతూ... వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యతిరేక నిరసనల కోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ర్యాలీలకు పంపడాన్ని తప్పుపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి సదరు ప్రైవేటు కాలేజీ వద్దకు చేరుకున్న బీటెక్ రవి, కాలేజీ యాజమాన్యాన్ని నేరుగా నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్లో ఒకవేళ లాఠీచార్జ్ లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదని నిలదీశారు.
విద్యార్థులను రాజకీయ నిరసనలకు పంపినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులను ఆందోళనలకు తీసుకురావాలని ఒత్తిడి చేసిన వైర్సీపీ నేతలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025కి అనుకూలంగా కాలేజీ ఫ్యాకల్టీతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. వైసీపీకి తిరుగులేని ప్రాబల్యం ఉన్న పులివెందులలో, ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించే పరిధిలో టీడీపీ నేత బీటెక్ రవి ఈ స్థాయిలో నిలదీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
BTech Ravi Pulivendula, YSRCP DSC 2025 protest, Pulivendula TDP viral video, AP DSC controversy 2025, BTech Ravi warning private college, Kadapa Pulivendula politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/btech-ravi-pulivendula-39-228744.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది