Publish Date:Jul 19, 2022
మనిషి శక్తిసామర్ధ్యాలకు అంతే ఉండదు. ప్రతీవారిలో ఆ శక్తి ఉంటుందని అంటారు. కానీ చాలాతక్కువ మందే దాన్ని గ్రహించుకోగల్లుతారు. ఊహాతీతంగా ఆ శక్తియుక్తులే ఇతరులకు అతీతంగా తయారు చేస్తాయి. ఇది కళాకారుడిని చేయవచ్చు, కుంగ్ ఫూ పైటర్గానూ చేయవచ్చు. రెప్పపాటులో శరవేగంగా శరీరావయవాలను కదిపి ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల అపార సామర్ధ్యం పొందడం బ్రూస్ లీకి మాత్రమే సాధ్యపడింది. అతనికి ముందు, ఆ తర్వాత మరెవ్వరూ లేరన్నది యావత్ ప్రపంచ ఫైటర్లూ, యువతా అంగీకరిస్తున్నారు. బహు శాంతంగా కనిపించే బ్రూస్లీ లో ఇంతటి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ కదలికలు కేవలం భగవత్ కృపతోనే సాధ్యపడిందనే వాదనా ఉంది. ఏమైనప్పటికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంటర్ ద డ్రాగన్!
లీ అసలు పేరు లి జున్ ప్యాన్. 1940 నవంబర్ 27న శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్ గెలుచుకున్నాడు. హాంగ్కాంగ్లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతనిలో ఏదో అతీత శక్తి ఉందన్న ప్రచారం కూడా బాగానే ఉండేది. ఊహించని అతివేగవంత కదలికల్లోనే అతనికి తెలీని శక్తి దాగిందనే వాదన పెద్ద చర్చగా ఉంది.
మనిషి తన శక్తిసామర్ధ్యాలను అనుసరించి జీవించడంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడనేవాడు లీ. అంతర్జాతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అతన్ని ఎంతో మార్చిందన్న వాదనా ఉంది. అతనిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వచ్చిందంటారు. అతనిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్రహించారు. కేవలం ఆత్మరక్షణకే యుద్ధకళలను నేర్చకు న్నాడే గాని ఇతరులను ఇబ్బందిపెట్టడానికి కాదని, అతని జీవితాన్ని గమనిస్తే తెలుస్తుందని తోటి నటీ నటులు అంటూండే వారు. గొప్ప వ్యక్తిని, మంచి మిత్రుడిని కోల్పోయానని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్కాంగ్లో మృతి చెందాడు. చిత్రమేమంటే అతనికి ప్రపంచఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లిందని బంధువులు, యావత్ ప్రపంచ వీరాభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూంటారు. లీ లాంటి వ్యక్తులు మళ్లీ జన్మిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమనే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bruce-leee-25-140125.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.